Calcutta High Court: బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసపై సిబిఐ దర్యాప్తు..కలకత్తా హైకోర్టు తీర్పు
బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసపై సిబిఐ దర్యాప్తు జరగాలని, ఈ కేసులన్నీ సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు తీర్పునిచ్చింది. 5 గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఈ మేరకు రూలింగ్ ఇచ్చింది. ఈ హింస, అల్లర్ల మీద కోర్టు ఆధ్వర్యాన
బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసపై సిబిఐ దర్యాప్తు జరగాలని, ఈ కేసులన్నీ సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు తీర్పునిచ్చింది. 5 గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఈ మేరకు రూలింగ్ ఇచ్చింది. ఈ హింస, అల్లర్ల మీద కోర్టు ఆధ్వర్యాన ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బిందాల్ నేతృత్వాన గల బెంచ్ సూచించింది. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింసపై దర్యాప్తు జరిపిన జాతీయ మానవ హక్కుల కమిషన్.. తన నివేదికను జులై 15 న కోర్టుకు సమర్పించింది. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా బదులు రూల్ ఆఫ్ రూలర్ విధానం నడుస్తోందని ఈ సంఘం తన 50 పేజీల నివేదికలో పేర్కొంది. పాలక పార్టీ మద్దతుదారులు. విపక్ష కార్యకర్తలపై దాడులకు దిగారని, అత్యాచారాలు, హత్యల వంటి దారుణాలు జరిగాయని ఈ రిపోర్టులో వెల్లడించింది,
ఈ కేసుపై దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించాలని, విచారణ రాష్ట్రం బయట జరగాలని కూడా ఈ సంఘం సూచించింది. కలకత్తా హైకోర్టు గత నెల 2 న కూడా ఇదే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఎన్నికల అనంతరం హింస జరగలేదని ప్రభుత్వం చెబుతోందని, కానీ జరిగిందనడానికి ఈ నివేదికే నిదర్శనమని పేర్కొంది. అయితే ప్రభుత్వంపై మానవ హక్కుల సంఘం చేసిన ఆరోపణలను ప్రభుత్వ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తోసిపుచ్చారు. ఆ సంఘంలోని కొంతమంది సభ్యులకు విపక్ష బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
మరిన్ని ఇక్కడ చూడండి : ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు గుడ్ న్యూస్ చెప్పరు.. కాజల్ సిస్టర్ నిషా అగర్వాల్..! ఏంటో తెలుసా..?Agarwal Sisters Video.
70 రూపాయల పెట్టుబడితో లక్షల ఆదాయం.. ఎలానో తెలుసా..?: Knowledge Video.
టోక్యో క్రీడాకారులతో ప్రధాని మోడీ ముచ్చట్లు.. వైరల్ అవుతున్న వీడియో:Tokyo Olympics contingent video.