బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా సింధియా…
రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. 11 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. తొమ్మిది స్థానాలకు బీజేపీ అభ్యర్థులు, రెండు స్థానాలకు మిత్ర పక్షాల అభ్యర్థులకు కేటాయించింది. కాగా..
రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. 11 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. తొమ్మిది స్థానాలకు బీజేపీ అభ్యర్థులు, రెండు స్థానాలకు మిత్ర పక్షాల అభ్యర్థులకు కేటాయించింది. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ వీడి బుధవారం బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా పేరును ప్రకటించింది. తొలి జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవ్వరికీ చోటు దక్కలేదు. బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల తొలిజాబితా.. జ్యోతిరాదిత్య సింధియా : (మధ్యప్రదేశ్) హర్ష్సింగ్ చౌహాన్ : (మధ్యప్రదేశ్) భువనేశ్వర్ కలిత : (అస్సాం) వివేక్ ఠాకూర్ : (బిహార్) అభయ్ భరద్వాజ్, రమీలా బెన్ (గుజరాత్) దీపక్ ప్రకాష్ : (జార్ఖండ్) మహారాజ్ : (మణిపూర్) ఉద్యన రాజే భోస్లే : (మహారాష్ట్ర) రాజేంద్ర గెహ్లాట్ : (రాజస్థాన్) ఆర్ఎస్పీ చీఫ్ రాందాస్ అథవాలే : (మహారాష్ట్ర) బీపీఎఫ్ నేత బుశ్వజిత్ : (అస్సాం)