AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID 19: కరోనా ఎఫెక్ట్.. కేంద్రం సంచలన నిర్ణయం.. ఏప్రిల్ 15 వరకు వీసాలు రద్దు..

COVID 19: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 వరకు అన్ని టూరిస్ట్ వీసాలను సస్పెండ్ చేసింది. ఈ నిబంధన మార్చి 13వ తేదీ నుంచి అమలులోకి రానుంది. అధికారిక వీసాలు, డిప్లొమాటిక్ వీసాలు, ఐరాస సంస్థల ప్రతినిధులకు సంబంధించిన వీసాలు.. ఇలా పలు రకాల వీసాలన్నింటిని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ […]

COVID 19: కరోనా ఎఫెక్ట్.. కేంద్రం సంచలన నిర్ణయం.. ఏప్రిల్ 15 వరకు వీసాలు రద్దు..
Ravi Kiran
|

Updated on: Mar 12, 2020 | 1:58 PM

Share

COVID 19: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 వరకు అన్ని టూరిస్ట్ వీసాలను సస్పెండ్ చేసింది. ఈ నిబంధన మార్చి 13వ తేదీ నుంచి అమలులోకి రానుంది. అధికారిక వీసాలు, డిప్లొమాటిక్ వీసాలు, ఐరాస సంస్థల ప్రతినిధులకు సంబంధించిన వీసాలు.. ఇలా పలు రకాల వీసాలన్నింటిని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది.

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో మంత్రుల కమిటీ సమావేశమై కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఈ నిర్ణయానికి వచ్చారు. అటు ఫిబ్రవరి 15 తర్వాత చైనా, ఇటలీ, ఇరాన్, కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీల నుంచి వచ్చిన విదేశీయులపై ప్రత్యేక దృష్టి సారించాలని.. తప్పనిసరిగా 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా విదేశాల నుంచి వచ్చే భారతీయులకు స్క్రీనింగ్ నిర్వహించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

భారత్‌లో ఇప్పటివరకు 62 కరోనా కేసులు నమోదయ్యాయి. చైనాలోని వుహాన్‌లో మొదలైన ఈ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 110 దేశాలకు వ్యాపించింది. కాగా, ఈ కోవిడ్ 19 కారణంగా సుమారు 4 వేల మందిపైగా ప్రాణాలు విడిచారు.

For More News: 

ఏపీ: ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు…

కరోనా ఎఫెక్ట్.. 6 వేల కోళ్లు సజీవ సమాధి.. వీడియో వైరల్..

సఫారీ సిరీస్.. టీమిండియాకు ఆ ముగ్గురే కీలకం…

‘వకీల్ సాబ్’లో గోవా బ్యూటీ..?

పొలిటికల్ ఎంట్రీపై తలైవా క్లారిటీ.. 60 నుంచి 65 శాతం సీట్లు యువతకే…

మధ్యతరగతి ప్రజలకు షాక్.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు తగ్గింపు.?

ఐపీఎల్ 2020 తాత్కాలికంగా రద్దు..?

రూ.60 లక్షల లాటరీ గెలిచాడు.. అంతలోనే షాక్ తగిలింది..