Sukanya Samriddhi Yojana: మధ్యతరగతి ప్రజలకు షాక్.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు తగ్గింపు.?
Sukanya Samriddhi Yojana: మధ్యతరగతి ప్రజలకు మోదీ ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. చిన్నమొత్తాల పొదుపు స్కీంల వడ్డీ రేట్లను తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి స్పష్టం చేశారు. ఒకవేళ ఈ నిర్ణయం గనక అమలులోకి వస్తే ఎక్కువగా పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పడనుందని చెప్పవచ్చు. ఏప్రిల్ 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి రానుండగా.. పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీం, సుకన్య […]
Sukanya Samriddhi Yojana: మధ్యతరగతి ప్రజలకు మోదీ ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. చిన్నమొత్తాల పొదుపు స్కీంల వడ్డీ రేట్లను తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి స్పష్టం చేశారు. ఒకవేళ ఈ నిర్ణయం గనక అమలులోకి వస్తే ఎక్కువగా పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పడనుందని చెప్పవచ్చు. ఏప్రిల్ 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి రానుండగా.. పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీం, సుకన్య సమృద్ధి యోజన వంటి స్మాల్ సేవింగ్స్ స్కీంల వడ్డీ రేట్లు పూర్తిగా తగ్గనున్నాయని సమాచారం.
చిన్న మొత్తాల పథకాలపై ఉన్న వడ్డీ రేట్లకు, రెపో రేట్ల మధ్య వ్యత్యాసం అధికంగా ఉందని.. అందువల్ల దాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్ధిక వ్యవస్థ మందగమనాన్ని నివారించేందుకు ప్రపంచదేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. కరోనా వైరస్ ప్రపంచ మార్కెట్ను దెబ్బతీస్తుండటంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్, బ్యాంక్ అఫ్ ఇంగ్లాండ్, ఇతర ప్రముఖ బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను సవరించాయి. దీనిలో భాగంగానే ఆర్బీఐ కూడా రెపో రేటును 50 బీపిఎస్కు తగ్గించే అవకాశం ఉందని.. అలాగే పాలసీ రేటును 25 బేసిక్ పాయింట్లకు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
For More News:
ఏపీ: ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు…
కరోనా భయం.. కేంద్రం సంచలన నిర్ణయం.. ఏప్రిల్ 15 వరకు అన్ని వీసాలు రద్దు..
కరోనా ఎఫెక్ట్.. 6 వేల కోళ్లు సజీవ సమాధి.. వీడియో వైరల్..
సఫారీ సిరీస్.. టీమిండియాకు ఆ ముగ్గురే కీలకం…
పొలిటికల్ ఎంట్రీపై తలైవా క్లారిటీ.. 60 నుంచి 65 శాతం సీట్లు యువతకే…