AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TMC office bearers: టీఎంసీ కార్యవర్గం రద్దు చేసిన మమతా బెనర్జీ.. కారణం అదేనా..?

తృణమూల్‌ కాంగ్రెస్‌లో నానాటికీ పెరిగిపోతున్న అసమ్మతిని, యువ–సీనియర్‌ విభేదాలను నివారించేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ దృష్టి సారించారు. అందులో భాగంగా పార్టీ కార్యవర్గాన్ని రద్దు చేశారు.

TMC office bearers: టీఎంసీ కార్యవర్గం రద్దు చేసిన మమతా బెనర్జీ.. కారణం అదేనా..?
Mamata Banerjee
Balaraju Goud
|

Updated on: Feb 13, 2022 | 1:29 PM

Share

TMC office bearers committee: పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఎంపీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee) ఇచ్చిన “ఒక మనిషి, ఒకే పదవి” అనే పిలుపు మేరకు పాత, కొత్త కాపుల మధ్య విభేదాలను తొలగించేందుకు రంగంలోకి దిగారు. శనివారం తన పార్టీలోని అన్ని సీనియర్ స్థాయిలలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అతని కన్సల్టెన్సీ సంస్థ- ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC) తో విభేదాల నేపథ్యంలో మమత పార్టీ సీనియర్ పదవులను రద్దు చేశార .

తృణమూల్‌ కాంగ్రెస్‌లో నానాటికీ పెరిగిపోతున్న అసమ్మతిని, యువ–సీనియర్‌ విభేదాలను నివారించేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ దృష్టి సారించారు. అందులో భాగంగా పార్టీ కార్యవర్గాన్ని రద్దు చేశారు. దాని స్థానంలో 20 మందితో నూతన జాతీయ వర్కింగ్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ శనివారం నిర్ణయం తీసుకున్నారు. వివాదానికి కేంద్ర బిందువుగా మారుతున్న మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీతో పాటు పలువురు యువ, సీనియర్‌ నేతలకు స్థానం కల్పించారు. కొత్త కార్యవర్గాన్ని మమత త్వరలోనే ప్రకటిస్తారని సీనియర్‌ నాయకుడు పార్థ బెనర్జీ మీడియాకు తెలిపారు. భేటీలో అభిషేక్‌ కూడా పాల్గొన్నారు. తృణమూల్‌లో వృద్ధ, యువతరం నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. జోడు పదవుల్లో ఉన్న పలువురు సీనియర్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు

TMC జాతీయ వర్కింగ్ ప్యానెల్ జాబితాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అమిత్ మిత్ర, తొమ్మిది మంది రాష్ట్ర మంత్రులు- పార్థ ఛటర్జీ, ఫిర్హాద్ హకీమ్, అరూప్ బిస్వాస్, జ్యోతిప్రియో మాలిక్, మోలోయ్ ఘటక్, చంద్రిమా భట్టాచార్జీ, బులు చిక్ బారిక్, అసిమా పాత్ర ఉన్నారు. సోవాందేబ్ ఛటర్జీ – ఇద్దరు రాజ్యసభ ఎంపీలు – సుబ్రతా బక్షి, సుఖేందు శేఖర్ రాయ్, ముగ్గురు లోక్‌సభ ఎంపీలు – సుదీప్ బందోపాధ్యాయ, కకోలి ఘోష్ దస్తిదార్ మరియు అభిషేక్, అనుబ్రత మండల్, రాజేష్ త్రిపాఠి, గౌతమ్ దేబ్, యశ్వంత్ సిన్హా సభ్యులుగా కొనసాగనున్నారు.2026 వరకు టీఎంసీతో కాంట్రాక్టు ఉన్న I-PACపై అభిషేక్‌తో ప్రత్యేక సమావేశాన్ని కూడా మమతా బెనర్జీ తన కాళీఘాట్ నివాసంలో వహించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలావుంటే, టీఎంసి పునర్వ్యవస్థీకరణపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ స్పందించారు. “కొత్త పార్టీని స్థాపించడానికి వారి ఉద్దేశ్యం నాకు తెలియదు. అయితే రాష్ట్రంలో ఇతర సీనియర్ నాయకులను జాతీయ సంస్థకు పంపడం ద్వారా. పార్టీ అధికారాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ చౌదరి స్పందిస్తూ.. ” ప్రశాంత్ కిషోర్ సహాయంతో ఇతర రాష్ట్రాల్లో తమ పార్టీ శాఖలను తెరవాలనే కలలుగన్న TMC చీఫ్, అతని మేనల్లుడికి నిరాశే ఎదురవుతుందన్నారు. త్రిపురలో ఆమె పార్టీకి ఎదురుదెబ్బ తగిలి, గోవాలో మరో ఎదురుదెబ్బ తగిలింది. అందుకే మమతా బెనర్జీ ఇప్పుడు తన పార్టీని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Read Also… Goa Elections 2022: గోవాలో ఒకే దశలో రేపే పోలింగ్.. బరిలో 301 మంది అభ్యర్థులు