AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murshidabad Bomb Blast: పాఠశాల సమీపంలో పేలిన బాంబ్‌.. ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు

బెంగాల్‌లో మళ్లీ బాంబు దాడి కలకలం సృష్టించింది. బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. ముర్షిదాబాద్ సమీపంలోని ఫరక్కాలో బాంబు పేలుడులో చిన్నారులు గాయపడిన ఘటన ఇంకా మరచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. ముర్షిదాబాద్‌లోని డోమ్‌కల్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన డోమ్‌కల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుష్బేరియాలో చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్ దగ్గర..

Murshidabad Bomb Blast: పాఠశాల సమీపంలో పేలిన బాంబ్‌.. ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు
Murshidabad Bomb Blast
Srilakshmi C
|

Updated on: Dec 13, 2023 | 8:18 PM

Share

బెంగాల్‌, డిసెంబర్‌ 12: బెంగాల్‌లో మళ్లీ బాంబు దాడి కలకలం సృష్టించింది. బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. ముర్షిదాబాద్ సమీపంలోని ఫరక్కాలో బాంబు పేలుడులో చిన్నారులు గాయపడిన ఘటన ఇంకా మరచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. ముర్షిదాబాద్‌లోని డోమ్‌కల్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన డోమ్‌కల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుష్బేరియాలో చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్ దగ్గర దుండగులు బాంబు దాచారు. ఓ చిన్నారి ‘బంతి’ అనుకుని బాంబును తీసుకెళ్లింది. దీంతో ఆ బాంబు పేలి పేలింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రక్షించి డోమ్‌కల్‌ ఉప జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు చిన్నారులు అక్కడ చికిత్స పొందుతున్నారు.

నవంబర్ నెలాఖరున ఫరక్కాలోని ఇమామ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కూడా ఓ చిన్నారి బంతి అనుకుని బాంబుతో ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో బాంబు పేలింది. పేలుడు ధాటికి ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఏడాది నవంబరులో చోటుచేసుకున్న ఈ ఘటన ముర్షిదాబాద్ ప్రజలు మరచిపోకముందే మరోమారు బాంబు పేలుడు సంభవించింది. ఈసారి బాంబును పాఠశాల పక్కనే దాచి ఉంచడంతో.. బంతి అనుకుని దానితో ఆడుకుంటున్న చిన్నారుల చేతుల్లో అది పేలింది. గాయపడిన ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది.

బెంగాల్‌ రాష్ట్రం గన్‌పౌడర్‌ డంప్‌గా మారిందని ప్రతిపక్షాలు పదే పదే ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర పోలీసు యంత్రాంగం కూడా పలు చోట్ల గట్టి నిఘా ఉంచింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బాంబులు సరఫరా అవుతున్నాయి. అయితే ఇప్పటికీ ముర్షిదాబాద్‌లో ఇలాంటి ఘటనలు రెండు సార్లు జరగడంతో దీనిలో పోలీసుల పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.