AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: నూతన పార్లమెంట్ వీడియోకు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ స్వరం.. అదిరిందంటున్న నెటిజన్లు ..

నూతన పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ప్రారంభించనున్న సందర్భంగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు హౌస్‌కి సంబంధించిన వీడియోను కూడా ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియోను పంచుకుంటూ ఇది మన 'నవ భారతదేశం' అంటూ ట్యాగ్ లైన్ జోడించారు. ఈ కొత్త పార్లమెంట్ హౌస్ గురించి తన వాయిస్ చెప్పారు.

Shah Rukh Khan: నూతన పార్లమెంట్ వీడియోకు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ స్వరం.. అదిరిందంటున్న నెటిజన్లు ..
Shah Rukh Khan Voice Over On New Parliament Video
Sanjay Kasula
|

Updated on: May 28, 2023 | 9:19 AM

Share

మరోవైపు ఆదివారం ఉదయం నూతన పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కొత్త పార్లమెంట్‌ భవంతి వద్ద ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించిన ప్రధాని మోదీ.. పార్లమెంట్‌ భవనంలోని స్పీకర్ కుర్చీ వద్ద సెంగోల్‌ను ప్రతిష్ఠిచారు ప్రధాని మోదీ. ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన చేశారు ప్రధాని మోదీ. అనంతరం తమిళనాడుకు చెందిన మఠాధిపతుల నుంచి ఉత్సవ రాజదండం ‘సెంగోల్‌’ను ఆయన స్వీకరించారు. ఆ తర్వాత సెంగోల్‌ను లోక్‌సభలో స్పీకర్‌ కుర్చీ పక్కన నెలకొల్పి మఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం పార్లమెంట్‌ నూతన భవన నిర్మాణంలో పాలుపంచుకున్న కొంతమంది కార్మికులను ప్రధాని సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

అంతకు ముందు.. కొత్త పార్లమెంట్ భవనానికి సంబంధించిన ఓ క్లిప్‌ను విడుదల చేసి, ఈ వీడియోకు వాయిస్ ఓవర్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతో సామాన్యుల నుంచి స్టార్స్ వరకు అందరూ ఇందులో పాల్గొన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్, కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కూడా తన గాత్రాన్ని అందించాడు. తన వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేశారు.

మరో వైపు నూతన పార్లమెంట్ భవనంపై దేశ, విదేశాల్లోని ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు. అభినందలు కురపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ భారతదేశంలో కొత్తగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనాన్ని కొనియాడారు. ఇందుకు తన ట్విట్టర్ వేదికగా.. కొత్త పార్లమెంట్ భవనాన్ని పూర్తిగా చూపించే వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోకు షారుఖ్.. ఇలా చెప్పుకొచ్చారు.. “మన రాజ్యాంగాన్ని సమర్థించే, ఈ గొప్ప దేశంలోని ప్రతి పౌరుడికి ప్రాతినిధ్యం వహించే, రక్షించే వ్యక్తులకు ఎంత అద్భుతమైన కొత్త ఇల్లు. .. గ్లోరీ ఫర్ ఇండియా ఏజ్ ఓల్డ్ డ్రీమ్,” అంటూ షారుఖ్ ఖాన్ ట్వీట్ చేసారు. అలాగే ఇది మన ‘నవ భారతదేశం’ కోసం అని తాను షేర్ చేసిన వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. దీంతో షారుఖ్ వీడియోను షేర్ చేస్తూ.. తమ అభిప్రాయాలను కూడా పంచుకుంటున్నారు.

షారుఖ్ ఖాన్ ట్వీట్ ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం