హిందీ మాట్లాడే స్థానానికి ఎంపీగా ఆయన అంగీకరిస్తారా?.. రాహుల్పై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హిందీ అనేక భాషలను మింగేసింది అంటూ చేసిన ఘాటు వ్యాఖ్యలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం(ఫిబ్రవరి 27) స్పందించారు. స్టాలిన్ వ్యాఖ్యలు సమాజాన్ని విభజించే నిస్సార ప్రయత్నాలు" అని అభివర్ణించారు. స్టాలిన్ వ్యాఖ్యలతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏకీభవిస్తారంటూ కేంద్ర మంత్రి ప్రశ్నించారు.

త్రిభాషా సూత్రంపై తమిళనాడు, కేంద్ర ప్రభుత్వం మధ్య రచ్చ రాజుకుంటోంది. కేంద్రం హిందీ, సంస్కృతాలను రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. గురువారం పార్టీ కార్యకర్తలకు రాసిన లేఖలో, హిందీని విధించడాన్ని వ్యతిరేకిస్తామని స్టాలిన్ అన్నారు. హిందీ ఒక ముసుగు అని ఆయన అన్నారు. సంస్కృతం ఒక దాచిన ముఖం. కానీ తమిళనాడు ఆ భాషను రుద్దడానికి అనుమతించదన్న ఆయన.. తమిళాన్ని దాని సంస్కృతిని కాపాడతానని స్టాలిన్ ప్రతిజ్ఞ చేశారు.
దీనిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా X వేదిక ట్విట్ చేశారు. సమాజాన్ని విభజించడానికి చేసే ఇలాంటి నిస్సార ప్రయత్నాల వల్ల పేలవమైన పాలన ఎప్పటికీ నిలబడదన్నారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ విషయంపై ఏమి చెబుతారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందన్నారు. హిందీ మాట్లాడే స్థానానికి ఎంపీగా ఆయన అంగీకరిస్తారా? అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రశ్నించారు.
Poor governance will never be hidden by such shallow attempts to divide society.
It will be interesting to know what the Leader of the Opposition, @RahulGandhi Ji, has to say on this subject. Does he, as MP of a Hindi-speaking seat, agree? https://t.co/Oj2tQseTno
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 27, 2025
అంతకు ముందు జాతీయ విద్యా విధానం (NEP) కింద త్రిభాషా సూత్రం ద్వారా కేంద్రం హిందీని రుద్దుతోందని DMK ఆరోపించింది. అయితే, కేంద్ర ప్రభుత్వం దీనిని తిరస్కరించింది. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో మాట్లాడే మైథిలి, బ్రజ్ భాష, బుందేల్ఖండి, అవధి వంటి అనేక ఉత్తర భారత భాషలు హిందీ ఆధిపత్యం కారణంగా కనుమరుగయ్యాయని స్టాలిన్ కార్యకర్తలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
‘‘భోజ్పురి, మైథిలి, అవధి, బ్రజ్, బుండేలి, గర్హ్వాలి, కుమావోని, మాగహి, మార్వారీ, మాల్వి, ఛత్తీస్గఢి, సంతాలి, అంజికా, హో, ఖరియా, ఖోర్తా, కుర్మాలి, కురుఖ్, ముండారి వంటి అనేక ఇతర భాషలు ఇప్పుడు మనుగడ కోసం పోరాడుతున్నాయి. ఏకశిలా హిందీ గుర్తింపుపై ప్రాధాన్యత ప్రాచీన మాతృభాషలను తుడిచిపెడుతోంది. ఉత్తరప్రదేశ్, బీహార్ ఎప్పుడూ కేవలం హిందీ కోటలు మాత్రమే కాదు. వాటి అసలు భాషలు ఇప్పుడు గతానికి సంబంధించిన అవశేషాలుగా మారాయి. ఇది ఎక్కడ ముగుస్తుందో తెలుసు కాబట్టి తమిళనాడు దీనిని వ్యతిరేకిస్తుంది” అని స్టాలిన్ అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




