AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓవైసీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియో ఫైర్ అయ్యారు. ఆయన మరో జాకీర్ నాయక్‌లా తయారవుతున్నాడంటూ ఆరోపించారు. ఇటీవల అయోధ్య తీర్పు వెలువడిన అనంతరం.. తీర్పుపై దేశ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఓ జాతీయా మీడియాతో మాట్లాడిని ఓవైసీ.. తనకు తమ మసీదును తిరిగి ఇవ్వాలంటూ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పోస్ట్‌ను జత చేస్తూ.. “ఐ వాంట్ మై మసీద్ బ్యాక్” అంటూ ఓవైసీ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. […]

ఓవైసీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 17, 2019 | 6:57 AM

Share

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియో ఫైర్ అయ్యారు. ఆయన మరో జాకీర్ నాయక్‌లా తయారవుతున్నాడంటూ ఆరోపించారు. ఇటీవల అయోధ్య తీర్పు వెలువడిన అనంతరం.. తీర్పుపై దేశ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఓ జాతీయా మీడియాతో మాట్లాడిని ఓవైసీ.. తనకు తమ మసీదును తిరిగి ఇవ్వాలంటూ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పోస్ట్‌ను జత చేస్తూ.. “ఐ వాంట్ మై మసీద్ బ్యాక్” అంటూ ఓవైసీ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి ఓవైసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలానే అతిగా మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకెళ్తుందన్నారు. అయితే తమ పోరాటం భూమి కోసం కాదని, తమ న్యాయపరమైన హక్కులు సాధించుకోవడం కోసమేనంటూ ఓవైసీ వ్యాఖ్యానించారు.అయితే బాబుల్ సుప్రీయో.. ఓవైసీని జాకీర్ నాయక్‌తో పోల్చడం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. జాకీర్ నాయక్‌‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విద్వేషాన్ని వ్యాపింపచేయడం, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం వంటి పలు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.