AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కశ్మీర్ కోసం ప్రాణాలైనా అర్పిస్తా..

జమ్ముకశ్మీరే కాదు.. పీఓకే, ఆక్సాచిన్ కూడా భారత్‌లో అంతర్భాగమేనన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. లోక్‌సభలో జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై జరుగుతున్న చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. నిన్న రాజ్య‌స‌భ‌లో ఆమోదం పొందిన రెండు క‌శ్మీర్ బిల్లుల‌ను ఇవాళ ఆయ‌న లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఆ స‌మ‌యంలో కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. దీంతో కాంగ్రెస్ తీరుపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ పై చట్టం […]

కశ్మీర్ కోసం ప్రాణాలైనా అర్పిస్తా..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 06, 2019 | 12:41 PM

Share

జమ్ముకశ్మీరే కాదు.. పీఓకే, ఆక్సాచిన్ కూడా భారత్‌లో అంతర్భాగమేనన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. లోక్‌సభలో జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై జరుగుతున్న చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. నిన్న రాజ్య‌స‌భ‌లో ఆమోదం పొందిన రెండు క‌శ్మీర్ బిల్లుల‌ను ఇవాళ ఆయ‌న లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఆ స‌మ‌యంలో కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. దీంతో కాంగ్రెస్ తీరుపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ పై చట్టం చేసేందుకు పార్లమెంట్‌కు అధికారం ఉందని.. ఇది దేశ సమగ్రతకు సంబంధించిన విషయమన్నారు. కాంగ్రెస్ తీరుపై ఆవేశానికి లోనైన షా.. భావోద్వేగ ప్రసంగం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు.. చైనా ఆక్రమిత ప్రాంతం కూడా భారత్‌ భూభాగమే అని స్పష్టం చేశారు. కశ్మీర్ కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమన్నారు. భార‌త రాజ్యాంగం ప్ర‌కారం జ‌మ్మూక‌శ్మీర్ స‌రిహ‌ద్దుల్లో పీవోకే, ఆక్‌సాయి చిన్ కూడా ఉన్నాయ‌న్నారు.