AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యపై అత్యాచారం.. కత్తితో బెదిరించి పైశాచికం.. తట్టుకోలేక భర్త ఏం చేశాడంటే..

ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. కష్టసుఖాల్లో ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ హాయిగా సాగిపోతున్నారు. కానీ వారి జీవితంలో ఊహించని కష్టం ఎదురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్యపై...

భార్యపై అత్యాచారం.. కత్తితో బెదిరించి పైశాచికం.. తట్టుకోలేక భర్త ఏం చేశాడంటే..
Harassment
Ganesh Mudavath
|

Updated on: Dec 25, 2022 | 6:29 PM

Share

ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. కష్టసుఖాల్లో ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ హాయిగా సాగిపోతున్నారు. కానీ వారి జీవితంలో ఊహించని కష్టం ఎదురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్యపై పక్కింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఫొటోలు తీసి ఇంటర్నెట్ లో పెడతానని బెదిరించాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేని భర్త.. ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా బలోత్రా పట్టణంలో ఓ కుటుంబం నివాసముంటోంది. ఓ రోజు బాధితురాలు చెకప్ కోసం బలోత్రా ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ పరీక్షలు చేయించుకుని ఇంటికి వచ్చింది. దీనిని గమనించిన అదే కాలనీకి చెందిన జమాల్ ఖాన్.. నేరుగా ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెకు కత్తి చూపించి బెదిరించాడు. అంతటితో ఆగకుండా అత్యాచారం చేశాడు. ఆ సమయంలో తన ఫోన్ లో ఫొటోలు తీశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని, చెబితే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె భయపడిపోయింది.

ఆమె ప్రవర్తనలో మార్పును గమనించిన భర్త.. గట్టిగా అడిగేసరికి తనపై జరిగిన దురాగతాన్ని వివరించింది. దీంతో బాధితురాలి భర్తకు ఏం చేయాలో అర్థం కాలేదు. రెండ్రోజుల పాటు విషాదంలో మునిగిపోయాడు. చివరకు డిసెంబర్ 20వ తేదీ రాత్రి ఇంట్లోని తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..