AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర రాజకీయం మళ్లీ మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే అక్కడ రాష్ట్రపతి పాలనకొనసాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓ వైపు ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్న వార్తలు వినిపిస్తుంటే..  త్వరలో రాష్ట్రంలో బీజేపీ-శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్నారు అథవాలే. తాజాగా అమిత్ షాతో కలిసి మహారాష్ట్ర అంశాన్ని ప్రస్తావించినప్పుడు అంతా సవ్యంగా సాగుతుందంటూ ధీమాను వ్యక్తం చేశారన్నారు. మీరు మధ్య మధ్యవర్తిత్వం చేస్తే.. […]

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 18, 2019 | 3:48 AM

Share

మహారాష్ట్ర రాజకీయం మళ్లీ మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే అక్కడ రాష్ట్రపతి పాలనకొనసాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓ వైపు ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్న వార్తలు వినిపిస్తుంటే..  త్వరలో రాష్ట్రంలో బీజేపీ-శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్నారు అథవాలే. తాజాగా అమిత్ షాతో కలిసి మహారాష్ట్ర అంశాన్ని ప్రస్తావించినప్పుడు అంతా సవ్యంగా సాగుతుందంటూ ధీమాను వ్యక్తం చేశారన్నారు. మీరు మధ్య మధ్యవర్తిత్వం చేస్తే.. ఈ సమస్యకు చెక్ పడుతుందని అమిత్ షాతో అన్నానని.. ఆ సమయంలో డోంట్ వర్రీ.. అంతా సెట్ అవుతుందన్నారని అథవాలే పేర్కొన్నారు.

కాగా, బీజేపీ-శివసేన మధ్య సీఎం సీటు విషయంలో విభేదాలు తలెత్తడంతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పలికినా.. బీజేపీ మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం లేదని.. కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమంటూ చేతులెత్తేసింది. ఇక శివసేన, ఎన్సీపీలకు కూడా అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు పార్టీలు కూడా గడువులోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేకపోవడంతో రాష్ట్రపతి పాలనకు దారితీసింది.ఈ నేపథ్యంలో ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన చర్చలు జరుపుతోంది. ఇక రేపో మాపో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తుందని అంతా అనుకుంటున్న వేళ.. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.

మరోవైపు శివసేన మాత్రం బీజేపీపై శనివారం తీవ్ర విమర్శలు గుప్పించింది. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ నేతలు ట్రై చేస్తున్నారంటూ ఆరోపించింది.

ఆ సినిమా నేను అనుకున్నట్లు తీసి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ సినిమా నేను అనుకున్నట్లు తీసి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఏడాది కిందట వెండి కొంటే ఇప్పుడు ఎంత లాభం వస్తుందో తెలిస్తే..
ఏడాది కిందట వెండి కొంటే ఇప్పుడు ఎంత లాభం వస్తుందో తెలిస్తే..
సింగరేణిలో గవర్నమెంట్ జాబ్ వదులుకుని మరీ జబర్దస్త్‌లోకి.. ఎవరంటే?
సింగరేణిలో గవర్నమెంట్ జాబ్ వదులుకుని మరీ జబర్దస్త్‌లోకి.. ఎవరంటే?
కిడ్నీ బాధిత కుటుంబాలకు ఊరట..!
కిడ్నీ బాధిత కుటుంబాలకు ఊరట..!
పాత ఇల్లు కొనుగోలు తర్వాత వాస్తు లోపాలను సరిచేసే సులభ మార్గాలు
పాత ఇల్లు కొనుగోలు తర్వాత వాస్తు లోపాలను సరిచేసే సులభ మార్గాలు
తల్లి ప్రేమ మరువలేనిది.. బిడ్డ మృతితో తల్లడిల్లిన గోమాత!
తల్లి ప్రేమ మరువలేనిది.. బిడ్డ మృతితో తల్లడిల్లిన గోమాత!
మరో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఆ స్టార్ హీరోకు జోడిగా..
మరో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఆ స్టార్ హీరోకు జోడిగా..
ఇదెక్కడి లెక్క సామీ..ఐసీసీ మీద నిప్పులు చెరిగిన మొహ్సిన్ నఖ్వీ
ఇదెక్కడి లెక్క సామీ..ఐసీసీ మీద నిప్పులు చెరిగిన మొహ్సిన్ నఖ్వీ
ఏకంగా 23 గిన్నిస్​ రికార్డులు కొల్లగొట్టిన గీతం విద్యార్థిని
ఏకంగా 23 గిన్నిస్​ రికార్డులు కొల్లగొట్టిన గీతం విద్యార్థిని
మీరు గడువు ముగిసిన మొబైల్‌ను ఉపయోగిస్తున్నారా? ఎలా చెక్‌ చేయాలి?
మీరు గడువు ముగిసిన మొబైల్‌ను ఉపయోగిస్తున్నారా? ఎలా చెక్‌ చేయాలి?