మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర రాజకీయం మళ్లీ మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే అక్కడ రాష్ట్రపతి పాలనకొనసాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓ వైపు ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్న వార్తలు వినిపిస్తుంటే..  త్వరలో రాష్ట్రంలో బీజేపీ-శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్నారు అథవాలే. తాజాగా అమిత్ షాతో కలిసి మహారాష్ట్ర అంశాన్ని ప్రస్తావించినప్పుడు అంతా సవ్యంగా సాగుతుందంటూ ధీమాను వ్యక్తం చేశారన్నారు. మీరు మధ్య మధ్యవర్తిత్వం చేస్తే.. […]

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Nov 18, 2019 | 3:48 AM

మహారాష్ట్ర రాజకీయం మళ్లీ మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే అక్కడ రాష్ట్రపతి పాలనకొనసాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓ వైపు ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్న వార్తలు వినిపిస్తుంటే..  త్వరలో రాష్ట్రంలో బీజేపీ-శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్నారు అథవాలే. తాజాగా అమిత్ షాతో కలిసి మహారాష్ట్ర అంశాన్ని ప్రస్తావించినప్పుడు అంతా సవ్యంగా సాగుతుందంటూ ధీమాను వ్యక్తం చేశారన్నారు. మీరు మధ్య మధ్యవర్తిత్వం చేస్తే.. ఈ సమస్యకు చెక్ పడుతుందని అమిత్ షాతో అన్నానని.. ఆ సమయంలో డోంట్ వర్రీ.. అంతా సెట్ అవుతుందన్నారని అథవాలే పేర్కొన్నారు.

కాగా, బీజేపీ-శివసేన మధ్య సీఎం సీటు విషయంలో విభేదాలు తలెత్తడంతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పలికినా.. బీజేపీ మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం లేదని.. కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమంటూ చేతులెత్తేసింది. ఇక శివసేన, ఎన్సీపీలకు కూడా అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు పార్టీలు కూడా గడువులోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేకపోవడంతో రాష్ట్రపతి పాలనకు దారితీసింది.ఈ నేపథ్యంలో ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన చర్చలు జరుపుతోంది. ఇక రేపో మాపో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తుందని అంతా అనుకుంటున్న వేళ.. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.

మరోవైపు శివసేన మాత్రం బీజేపీపై శనివారం తీవ్ర విమర్శలు గుప్పించింది. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ నేతలు ట్రై చేస్తున్నారంటూ ఆరోపించింది.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?