Vande Bharat: మంత్రి గారి డిమాండ్ నెరవేరితే.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వందే భారత్ రైలు..

భారత రైల్వే వందేభారత్ రైళ్లను పలు ప్రాంతాల మధ్య ఇప్పటికే విజయవంతంగా నడుపుతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా వందే భారత్ రైలును ప్రారంభించేందుకు ఇండియన్ రైల్వే సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది.

Vande Bharat: మంత్రి గారి డిమాండ్ నెరవేరితే.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వందే భారత్ రైలు..
Vande Bharat Express
Follow us

|

Updated on: Dec 08, 2022 | 12:21 PM

Vande Bharat Train: భారత రైల్వే వందేభారత్ రైళ్లను పలు ప్రాంతాల మధ్య ఇప్పటికే విజయవంతంగా నడుపుతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా వందే భారత్ రైలును ప్రారంభించేందుకు ఇండియన్ రైల్వే సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన ఓ మంత్రి తమ ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు వందే భారత్ రైలు ప్రారంభించాలంటూ డిమాండ్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర కేబినెట్ మంత్రి సుధీర్ ముంగంటివార్.. నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు వందే భారత్ రైలు కావాలంటూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. మహారాష్ట్ర విదర్భ ప్రాంతానికి, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయని.. చాలామంది ఈ ప్రాంతాల మధ్య ప్రయాణం చేస్తుంటారని వివరించారు. నాగ్‌పూర్, హైదరాబాద్ రూట్‌లో వందేభారత్ రైలును ప్రారంభించడం వల్ల చాలామందికి ప్రయోజనం కలుగుతుందని సుధీర్ ముంగంటివార్ పేర్కొన్నారు.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు రాసిన లేఖలో.. మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ పలు విషయాలను ప్రస్తావించారు. తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని నాగ్‌పూర్, గోండియా, భండారా, చంద్రపు నాలుగు జిల్లాలకు మంచి వాణిజ్య సంబంధాలున్నాయని తెలిపారు. కావున ఈ రూట్‌లో వందే భారత్ రైలు నడిపితే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందని.. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Vande Bharat Train

Sudhir Mungantiwar -Vande Bharat Train

ప్రస్తుతం నాగ్‌పూర్ హైదరాబాద్ మార్గంలో 22 రైళ్లు నడుస్తున్నాయి. ఈ మార్గంలో వందే భారత్ రైలును చేర్చడం వలన తక్కువ సమయంలో 575 కి.మీ దూరాన్ని చేరుకోవచ్చు. వందే భారత్ రైలు వల్ల పర్యాటకులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తక్కువ సమయంలో ఈ ప్రాంతాల మధ్య ప్రయాణించడానికి సౌకర్యంగా ఉంటుందని సుధీర్ ముంగంటివార్ లేఖలో పేర్కొన్నారు. విదర్భలోని నాలుగు జిల్లాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం వల్ల రాష్ట్రంలోని అధిక జనాభాకు ప్రయోజనం చేకూరుస్తుంది.

ఇవి కూడా చదవండి

కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (డిసెంబర్ 11న) ఛత్తీస్‌గఢ్‌లో ఆరవ వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు . ఈ రైలు నాగ్‌పూర్, బిలాస్‌పూర్ మార్గంలో నడుస్తుంది. బిలాస్‌పూర్-నాగ్‌పూర్ మార్గంలో ప్రయాణించే ఆరవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వారంలో ఆరు రోజులు చొప్పున.. ఐదున్నర గంటల్లో గమ్యానికి చేరుకోనుంది. ఈ రైలు రాయ్‌పూర్, దుర్గ్, గోండియాలో ఆగనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!