AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. పానీపూరి తినలేదని వృద్ధురాలిని చంపేసిన మహిళ..

పోలీసులకు ఫిర్యాదు చేసింది. శీతల్, ఆమె కుటుంబ సభ్యులు ఆమె అత్త శకుంతలా దేవిని హత్య చేశారని ఆరోపించారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు శీతల్, మధు, మీనాక్షి, షాలులను అదుపులోకి తీసుకున్నారు.

దారుణం.. పానీపూరి తినలేదని వృద్ధురాలిని చంపేసిన మహిళ..
Panipuri
Jyothi Gadda
|

Updated on: Apr 07, 2023 | 7:25 PM

Share

ఢిల్లీలోని షాహదారా జిల్లా జీటీబీ ఎన్‌క్లేవ్ ప్రాంతంలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో పానీపూరీ తినలేదని వృద్ధురాలిని కొట్టడంతో ఆమె మృతి చెందింది. బాధితురాలు పానీపూరి తినడానికి నిరాకరించడంతో ఆమె తన ఇరుగుపొరుగు మహిళలతో గొడవకు దిగింది. గొడవలోనే ఒక వృద్ధురాలిని తోసేసింది. దాంతో మహిళ తలకు తీవ్రమైన గాయం కావడంతో..ఆమెను హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే వృద్ధురాలు శకుంతలా దేవి చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ఈ కేసులో నలుగురు మహిళలపై మృతురాలి కోడలు ఫిర్యాదు చేసింది. కోడలు ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేసి నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

స్థానికంగా నివాసముంటున్న శీతల్‌ అనే మహిళ పానీపూరి తయారు చేసింది. ఆమె చేసిన పానీపూరి తినమని పొరుగు వారిని కోరగా శకుంతలా దేవి నిరాకరించింది. దీంతో ఆగ్రహనికి గురైన మహిళ..వారితో గొడవకు దిగింది. ఇంతలో శీతల్ తల్లి, ఇద్దరు కోడలు కూడా వచ్చారు. నలుగురూ కలిసి శకుంతలను కొట్టడం మొదలుపెట్టారు. గొడవ జరుగుతుండగా,శకుంతల కిందపడిపోయింది. దాంతో అక్కడికక్కడే మృతిచెందింది. శకుంతలా దేవి హార్ట్ పేషెంట్ అని తెలిసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని జీటీబీ ఎన్‌క్లేవ్‌లోని ఖేడా విలేజ్‌లోని స్ట్రీట్ నెం-7లో ఈ ఘటన జరిగింది. శకుంతలాదేవికి ముగ్గురు కొడుకులు. అవధేష్ కుమార్, సుభాష్, రాజేష్. నిందితురాలు శీతల్ కుటుంబం పొరుగున నివసిస్తోంది. కొడుకు రాజేష్ భార్య శకుంతలను ఆసుపత్రికి తీసుకెళ్లింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. శీతల్, ఆమె కుటుంబ సభ్యులు ఆమె అత్త శకుంతలా దేవిని హత్య చేశారని ఆరోపించారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు శీతల్, మధు, మీనాక్షి, షాలులను అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు