AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. పానీపూరి తినలేదని వృద్ధురాలిని చంపేసిన మహిళ..

పోలీసులకు ఫిర్యాదు చేసింది. శీతల్, ఆమె కుటుంబ సభ్యులు ఆమె అత్త శకుంతలా దేవిని హత్య చేశారని ఆరోపించారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు శీతల్, మధు, మీనాక్షి, షాలులను అదుపులోకి తీసుకున్నారు.

దారుణం.. పానీపూరి తినలేదని వృద్ధురాలిని చంపేసిన మహిళ..
Panipuri
Jyothi Gadda
|

Updated on: Apr 07, 2023 | 7:25 PM

Share

ఢిల్లీలోని షాహదారా జిల్లా జీటీబీ ఎన్‌క్లేవ్ ప్రాంతంలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో పానీపూరీ తినలేదని వృద్ధురాలిని కొట్టడంతో ఆమె మృతి చెందింది. బాధితురాలు పానీపూరి తినడానికి నిరాకరించడంతో ఆమె తన ఇరుగుపొరుగు మహిళలతో గొడవకు దిగింది. గొడవలోనే ఒక వృద్ధురాలిని తోసేసింది. దాంతో మహిళ తలకు తీవ్రమైన గాయం కావడంతో..ఆమెను హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే వృద్ధురాలు శకుంతలా దేవి చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ఈ కేసులో నలుగురు మహిళలపై మృతురాలి కోడలు ఫిర్యాదు చేసింది. కోడలు ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేసి నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

స్థానికంగా నివాసముంటున్న శీతల్‌ అనే మహిళ పానీపూరి తయారు చేసింది. ఆమె చేసిన పానీపూరి తినమని పొరుగు వారిని కోరగా శకుంతలా దేవి నిరాకరించింది. దీంతో ఆగ్రహనికి గురైన మహిళ..వారితో గొడవకు దిగింది. ఇంతలో శీతల్ తల్లి, ఇద్దరు కోడలు కూడా వచ్చారు. నలుగురూ కలిసి శకుంతలను కొట్టడం మొదలుపెట్టారు. గొడవ జరుగుతుండగా,శకుంతల కిందపడిపోయింది. దాంతో అక్కడికక్కడే మృతిచెందింది. శకుంతలా దేవి హార్ట్ పేషెంట్ అని తెలిసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని జీటీబీ ఎన్‌క్లేవ్‌లోని ఖేడా విలేజ్‌లోని స్ట్రీట్ నెం-7లో ఈ ఘటన జరిగింది. శకుంతలాదేవికి ముగ్గురు కొడుకులు. అవధేష్ కుమార్, సుభాష్, రాజేష్. నిందితురాలు శీతల్ కుటుంబం పొరుగున నివసిస్తోంది. కొడుకు రాజేష్ భార్య శకుంతలను ఆసుపత్రికి తీసుకెళ్లింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. శీతల్, ఆమె కుటుంబ సభ్యులు ఆమె అత్త శకుంతలా దేవిని హత్య చేశారని ఆరోపించారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు శీతల్, మధు, మీనాక్షి, షాలులను అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?