AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harassment: బాలికపై అత్యాచారం.. మూడు గంటల పాటు చిత్రహింసలు.. 18 గంటలైనా నమోదు కాని ఎఫ్ఐఆర్

ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్ నవూ లో మరోసారి దారుణ ఘటన జరిగింది. మరో సారి ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసు తెరపైకి వచ్చింది. ట్యూషన్‌ కు వెళ్లి తిరిగి వస్తున్న బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. కథౌట సమీపంలో...

Harassment: బాలికపై అత్యాచారం.. మూడు గంటల పాటు చిత్రహింసలు.. 18 గంటలైనా నమోదు కాని ఎఫ్ఐఆర్
Harassment
Ganesh Mudavath
|

Updated on: Oct 17, 2022 | 11:49 AM

Share

ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్ నవూ లో మరోసారి దారుణ ఘటన జరిగింది. మరో సారి ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసు తెరపైకి వచ్చింది. ట్యూషన్‌ కు వెళ్లి తిరిగి వస్తున్న బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. కథౌట సమీపంలో ఇద్దరు అగంతకులు ఆటోలో ప్రయాణిస్తున్న బాలికను అడ్డుుకన్నారు. ఆ తర్వాత ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఈ ఘటన జరగగా.. బాధితురాలిని హుస్దియా కూడలిలో వదిలేసి వెళ్లిపోయారు. అక్కడి నుంచి అతి కష్టం మీద ఇంటికి చేరుకున్న బాధితురాలు.. జరిగిన విషయమంతా కుటుంబసభ్యులకు చెప్పింది. ఆమె చెప్పిన వివరాలతో వెంటనే అలర్ట్ అయిన కుటుంబీకులు.. బాధితురాలితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. జరిగిన దారుణ ఘటన గురించి వారికి చెప్పారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఆదివారం సాయంత్రం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు హుటాహుటిన నిందితులిద్దరిపై కేసు నమోదు చేశారు. అయితే వారిని ఇంకా కస్టడీలోకి తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటన జరిగిన 18 గంటల తర్వాత పోలీసులు బాలికను వైద్యం కోసం ఆస్పత్రికి పంపించారు. ఈ ఘటన రాజధాని లఖ్ నవూ లో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో మరోసారి తెలిపింది.

బాలిక ట్యూషన్ ముగించుకుని ఆటోలో వస్తున్న సమయంలో ఇద్దరు యువకులు ఆటో ఎక్కారు. కాసేపు ప్రయాణం చేసిన తర్వాత విద్యార్థినిపై దాడి చేశారు. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ తరువాత యువకులిద్దరూ బాలికను ఆటోలో సుశాంత్ గోల్ఫ్ సిటీలోని ప్లాసియో మాల్ వెనుక ఉన్న పొదల్లోకి తీసుకెళ్లారు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు 3 గంటల పాటు చిత్రహింసలకు గురి చేశారు. ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో ఆటోలో నుంచి కిందకి పడేసి వెళ్లిపోయారు.

ఈస్ట్ లక్నో డీసీపీ ప్రాచీ సింగ్ ఝల్కారీ ఆస్పత్రికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు.ఈ విషయమై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. త్వరలో నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపుతామని చెప్పారు. విద్యార్థిని ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు విభూతిఖండ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. నిందితులిద్దరినీ ఆకాష్, ఇమ్రాన్‌లుగా గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
బంగార ధరలు ఒక్కసారిగా ఢమాల్.. గురువారం ధరలు ఇవే..
బంగార ధరలు ఒక్కసారిగా ఢమాల్.. గురువారం ధరలు ఇవే..
శ్రీదేవి ఆస్తుల వివాదం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు..
శ్రీదేవి ఆస్తుల వివాదం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు..
వీరి జీవితాన్ని మార్చడానికి కలిసి రాబోతున్న భారీ గ్రహాలు
వీరి జీవితాన్ని మార్చడానికి కలిసి రాబోతున్న భారీ గ్రహాలు
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ చెల్లింపులకు కూడా యూపీఐ ఛార్జీలు పడతాయా?
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ చెల్లింపులకు కూడా యూపీఐ ఛార్జీలు పడతాయా?
రూ.1.7 లక్షల పెట్టుబడితో నాటుకోళ్ల పెంపకం.. రూ. 10 లక్షల లాభం..!
రూ.1.7 లక్షల పెట్టుబడితో నాటుకోళ్ల పెంపకం.. రూ. 10 లక్షల లాభం..!
ట్రైలర్ లేకుండానే రిలీజైన తెలుగు సినిమాలివే.. రిజల్ట్స్ ఏంటంటే?
ట్రైలర్ లేకుండానే రిలీజైన తెలుగు సినిమాలివే.. రిజల్ట్స్ ఏంటంటే?
RRB రైల్వేలో పారా మెడికల్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
RRB రైల్వేలో పారా మెడికల్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇస్తున్న బారాముల్లా ఎక్స్‌ప్రెస్
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇస్తున్న బారాముల్లా ఎక్స్‌ప్రెస్
అమ్మమ్మ చేతి రుచిని గుర్తు చేసే పచ్చి కొబ్బరి బెల్లం తాలికలు
అమ్మమ్మ చేతి రుచిని గుర్తు చేసే పచ్చి కొబ్బరి బెల్లం తాలికలు
మూడో టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగానికి సిద్దం
మూడో టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగానికి సిద్దం