AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరికాసేపట్లో పెళ్లి.. బరాత్‌తో వధువు ఇంటికి వెళ్తుండగా దూసుకొచ్చిన మృత్యులారీ.. ఐదుగురు అక్కడికక్కడే..

Odisha Accident: మరి కాసేపట్లో పెళ్లి.. అంతా రెడీ అయ్యారు.. మరికొంత దూరంలోనే వధువు ఇల్లు ఉంది.. దీంతో వరుడు సహా.. అతని బంధు మిత్రులు ఊరేగింపుగా వెళ్తున్నారు. ఇంతలోనే.. లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది.

మరికాసేపట్లో పెళ్లి.. బరాత్‌తో వధువు ఇంటికి వెళ్తుండగా దూసుకొచ్చిన మృత్యులారీ.. ఐదుగురు అక్కడికక్కడే..
Wedding
Shaik Madar Saheb
|

Updated on: Jun 28, 2023 | 9:01 AM

Share

Odisha Accident: మరి కాసేపట్లో పెళ్లి.. అంతా రెడీ అయ్యారు.. మరికొంత దూరంలోనే వధువు ఇల్లు ఉంది.. దీంతో వరుడు సహా.. అతని బంధు మిత్రులు ఊరేగింపుగా వెళ్తున్నారు. ఇంతలోనే.. లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా.. 10మంది గాయపడ్డారు. దీంతో వివాహ వేడుక కాస్త.. విషాదంగా మారింది. వివాహ ఊరేగింపుపైకి ట్రక్కు దూసుకెళ్లిన ఘటన ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. జాతీయ రహదారి-20 సమీపంలోని సతీఘర్ సాహి వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీఘర్ సాహికి చెందిన కార్తీక్ పాత్ర కుమార్తె, హరిచందన్‌పూర్ బ్లాక్ పరిధిలోని మాన్‌పూర్ గ్రామానికి చెందిన హడిబంధు పాత్ర కుమారుడు హేమంత పాత్రతో వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో వరుడు, అతని బంధుమిత్రులు DJ మ్యూజిక్ తో బరాత్ గా వధువు ఇంటికి వెళ్తున్నారు. వధువు ఇంటికి కొంత దూరంలో ఉండగానే.. తెల్లవారుజామున 1.30 గంటలకు ఒక ట్రక్ ఊరేగింపు వైపు దూసుకొచ్చి ఢీకొట్టినట్లు తెలిపారు.

ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి కియోంజర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..