AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కమలం గూటికి చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగలింది. ఇటీవల మణిపూర్‌ కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు బుధవారం నాడు కమలం గూటకి..

కమలం గూటికి చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 19, 2020 | 6:07 PM

Share

కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగలింది. ఇటీవల మణిపూర్‌ కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు బుధవారం నాడు కమలం గూటకి చేరుకున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కండువా కప్పుకుని.. పార్టీ సభ్యత్వాన్ని కూడా తీసుకున్నారు. వీరిలో మణిపూర్ సీఎల్పీ నాయకుడు ఓక్రామ్ ఇబోబి సింగ్ మేనల్లుడు ఓక్రామ్ హెన్రీ సింగ్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటుగా.. ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ పాల్గొన్నారు.

Read More :

దేశరాజధానిలో భారీ వర్షం.. గోడ కూలి కార్లు ధ్వంసం

విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం