AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రైం థ్రిల్లర్‌కి మించిన స్కెచ్‌.. రెండేళ్ల కొడుకుని కిరాతకంగా చంపిన కన్నతల్లి!

హిందీ సినిమాలు చూసి ప్రేరణ పొంది కన్నబిడ్డని హతమార్చింది ఓ కసాయి తల్లి. ఆ తర్వాత కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ వాలకంపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం బయట..

క్రైం థ్రిల్లర్‌కి మించిన స్కెచ్‌.. రెండేళ్ల కొడుకుని కిరాతకంగా చంపిన కన్నతల్లి!
Naina Mandavi
Srilakshmi C
|

Updated on: Jul 04, 2023 | 2:40 PM

Share

సూరత్‌: హిందీ సినిమాలు చూసి ప్రేరణ పొంది కన్నబిడ్డని హతమార్చింది ఓ కసాయి తల్లి. ఆ తర్వాత కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ వాలకంపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఈ దారుణ ఘటన చత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఛత్తీస్‌గఢ్‌లోని లేక్‌సిటీ రెసిడెన్సీ ప్రాజెక్ట్‌లో నివాసం ఉంటోన్న నైనా మాండవి (22) అనే మహిళకు నాలుగేళ్ల క్రితం భువనేశ్వర్‌తో వివాహం జరిగింది. భువనేశ్వర్‌ నిత్యం చిత్రహింసలకు గురిచేస్తుండటంతో భర్తకు విడాకులిచ్చి రెండేళ్ల క్రితం రెండు నెలల కొడుకు వీర్‌ను తీసుకుని సూరత్‌కు వచ్చింది. అక్కడే  రెండేళ్లుగా కూలి పనులు చేసుకుంటూ కుమారుడితో జీవనం సాగిస్తోంది. కుమారుడి పేరు వీర్‌ అలియాస్‌ భోండు. పని చేసే చోట సంజూ అనే కూలీతో నైనాకు పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఐతే సంజూని వివాహం చేసుకోవడానికి కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించి వదిలించుకోవాలని పథకం పన్నింది నైనా. గట్టుచప్పుడు కాకుండా కొడుకును హత్య చేసింది. అనంతరం తన కొడుకు కనిపించడం లేదంటూ జూన్ 27న దిండోలి పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్‌ కేసు పెట్టింది.

రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. తల్లే బిడ్డను హత్య చేసి నాటకాలు ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సదరు మహిళను పోలీసులు గత శనివారం (జులై 1) అరెస్టు చేసి విచారించగా నేరం అంగీకరించింది. ఐతే పోలీసులు నిందితురాలు నైనా  కాలనీ వెనుక ఉన్న బహిరంగ ప్రదేశంలో మృతదేహాన్ని పాతిపెట్టినట్లు చెప్పింది. ఆ ప్రదేశంలో తవ్వగా మృతదేహం కనిపించలేదు. ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. తాను క్రైం థ్రిల్లర్‌ సినిమాలు చూస్తుంటానని.. వాటిని చూసి ఇన్‌స్పైర్‌ అయ్యి బిడ్డను గొంతుకోసి చంపి, మృతదేహాన్ని నీటితో నిండిన ఎలివేటర్ డక్ట్‌లో విసిరేనట్లు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
పుదీనా మొక్కను ఇంట్లో పెంచుకోవడం ఎలా..? గుబురుగా పెరగాలంటే..
పుదీనా మొక్కను ఇంట్లో పెంచుకోవడం ఎలా..? గుబురుగా పెరగాలంటే..
ఈ ఆలయానికి వెళ్లి దీక్ష తీసుకుంటే.. మద్యపానం జోలికే వెళ్లరు..!
ఈ ఆలయానికి వెళ్లి దీక్ష తీసుకుంటే.. మద్యపానం జోలికే వెళ్లరు..!
చంద్రగ్రహణం: దోషాలు తొలగించి.. శుభ ఫలితాలు ఇచ్చే రెమెడీ ఇదే..
చంద్రగ్రహణం: దోషాలు తొలగించి.. శుభ ఫలితాలు ఇచ్చే రెమెడీ ఇదే..
రోకో ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్‌‌కు రెడీ
రోకో ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్‌‌కు రెడీ
రూ.10 వేలతో ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయొచ్చు! లాభాలే లాభాలు
రూ.10 వేలతో ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయొచ్చు! లాభాలే లాభాలు
చమురు సరఫరా ఆగిపోతే దేశంలో పెట్రోల్ నిల్వలు ఎన్ని రోజులు ఉంటాయి?
చమురు సరఫరా ఆగిపోతే దేశంలో పెట్రోల్ నిల్వలు ఎన్ని రోజులు ఉంటాయి?
బ్లాక్ బస్టర్ మూవీ మిస్ చేసుకున్న వైష్ణవి..
బ్లాక్ బస్టర్ మూవీ మిస్ చేసుకున్న వైష్ణవి..
బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఏపీ గురించి సలహాలు.. ఇవ్వొద్దు
బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఏపీ గురించి సలహాలు.. ఇవ్వొద్దు
చమురు రవాణాకు గేట్వే మూసివేత.. గ్లోబల్ మార్కెట్లలో కల్లోలం..!
చమురు రవాణాకు గేట్వే మూసివేత.. గ్లోబల్ మార్కెట్లలో కల్లోలం..!
ఇరాన్‌-అమెరికా యుద్ధం.. భారత్‌కు గుడ్‌న్యూస్‌!
ఇరాన్‌-అమెరికా యుద్ధం.. భారత్‌కు గుడ్‌న్యూస్‌!