AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రైం థ్రిల్లర్‌కి మించిన స్కెచ్‌.. రెండేళ్ల కొడుకుని కిరాతకంగా చంపిన కన్నతల్లి!

హిందీ సినిమాలు చూసి ప్రేరణ పొంది కన్నబిడ్డని హతమార్చింది ఓ కసాయి తల్లి. ఆ తర్వాత కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ వాలకంపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం బయట..

క్రైం థ్రిల్లర్‌కి మించిన స్కెచ్‌.. రెండేళ్ల కొడుకుని కిరాతకంగా చంపిన కన్నతల్లి!
Naina Mandavi
Srilakshmi C
|

Updated on: Jul 04, 2023 | 2:40 PM

Share

సూరత్‌: హిందీ సినిమాలు చూసి ప్రేరణ పొంది కన్నబిడ్డని హతమార్చింది ఓ కసాయి తల్లి. ఆ తర్వాత కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ వాలకంపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఈ దారుణ ఘటన చత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఛత్తీస్‌గఢ్‌లోని లేక్‌సిటీ రెసిడెన్సీ ప్రాజెక్ట్‌లో నివాసం ఉంటోన్న నైనా మాండవి (22) అనే మహిళకు నాలుగేళ్ల క్రితం భువనేశ్వర్‌తో వివాహం జరిగింది. భువనేశ్వర్‌ నిత్యం చిత్రహింసలకు గురిచేస్తుండటంతో భర్తకు విడాకులిచ్చి రెండేళ్ల క్రితం రెండు నెలల కొడుకు వీర్‌ను తీసుకుని సూరత్‌కు వచ్చింది. అక్కడే  రెండేళ్లుగా కూలి పనులు చేసుకుంటూ కుమారుడితో జీవనం సాగిస్తోంది. కుమారుడి పేరు వీర్‌ అలియాస్‌ భోండు. పని చేసే చోట సంజూ అనే కూలీతో నైనాకు పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఐతే సంజూని వివాహం చేసుకోవడానికి కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించి వదిలించుకోవాలని పథకం పన్నింది నైనా. గట్టుచప్పుడు కాకుండా కొడుకును హత్య చేసింది. అనంతరం తన కొడుకు కనిపించడం లేదంటూ జూన్ 27న దిండోలి పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్‌ కేసు పెట్టింది.

రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. తల్లే బిడ్డను హత్య చేసి నాటకాలు ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సదరు మహిళను పోలీసులు గత శనివారం (జులై 1) అరెస్టు చేసి విచారించగా నేరం అంగీకరించింది. ఐతే పోలీసులు నిందితురాలు నైనా  కాలనీ వెనుక ఉన్న బహిరంగ ప్రదేశంలో మృతదేహాన్ని పాతిపెట్టినట్లు చెప్పింది. ఆ ప్రదేశంలో తవ్వగా మృతదేహం కనిపించలేదు. ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. తాను క్రైం థ్రిల్లర్‌ సినిమాలు చూస్తుంటానని.. వాటిని చూసి ఇన్‌స్పైర్‌ అయ్యి బిడ్డను గొంతుకోసి చంపి, మృతదేహాన్ని నీటితో నిండిన ఎలివేటర్ డక్ట్‌లో విసిరేనట్లు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ప్రతి ఇంట్లో పాములే.. వాటితోనే పిల్లల ఆటలు.. ఈ ఊరి కథ తెలిస్తే..
ప్రతి ఇంట్లో పాములే.. వాటితోనే పిల్లల ఆటలు.. ఈ ఊరి కథ తెలిస్తే..
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!
మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..
మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..
లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందా..? రాత్రి పువ్వులు కోయడంపై ఆశ్చర్యకర
లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందా..? రాత్రి పువ్వులు కోయడంపై ఆశ్చర్యకర
పొట్ట ఖరాబైందా?.. విరేచనాలను తగ్గించే హోం రెమెడీస్ ఇవే!
పొట్ట ఖరాబైందా?.. విరేచనాలను తగ్గించే హోం రెమెడీస్ ఇవే!
గురువు స్థానం మారాడు.. ఈ రాశుల వారికి ఇక చుక్కలే.. !
గురువు స్థానం మారాడు.. ఈ రాశుల వారికి ఇక చుక్కలే.. !
ఉప్పల్ అడ్డాలో కోహ్లీ పరుగుల వేట.. అరుదైన రికార్డులో రన్ మెషీన్
ఉప్పల్ అడ్డాలో కోహ్లీ పరుగుల వేట.. అరుదైన రికార్డులో రన్ మెషీన్
పెద్ది స్పెషల్ సాంగ్ రాయడానికే 50 రోజులు పట్టింది. కారణం ఇదే..
పెద్ది స్పెషల్ సాంగ్ రాయడానికే 50 రోజులు పట్టింది. కారణం ఇదే..
మండు ఎండలో కూడా మరువం ఆరోగ్యంగా ఉండాలా ఐతే ఈ ఒక్క పని చేయండి
మండు ఎండలో కూడా మరువం ఆరోగ్యంగా ఉండాలా ఐతే ఈ ఒక్క పని చేయండి
ఆ వందే భారత్‌లో కీలక మార్పులు.. 8 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లు
ఆ వందే భారత్‌లో కీలక మార్పులు.. 8 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లు