AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG: రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్‌కు దిగ్గజాలు రెడీ.. ఎప్పుడంటే?

Afghanistan Tour of India 2026: భారత జట్టు ఆఫ్ఘాన్‌తో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరోసారి బ్లూ జెర్సీతో కనిపించేందుకు సిద్ధమయ్యారు. ఆ సిరీస్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో ఓసారి చూద్దాం..

IND vs AFG: రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్‌కు దిగ్గజాలు రెడీ.. ఎప్పుడంటే?
Rohit Virat
Venkata Chari
|

Updated on: Mar 02, 2026 | 3:56 PM

Share

Afghanistan Tour of India 2026: భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India) 2026 జూన్‌లో జరగనున్న ఆఫ్ఘానిస్తాన్ భారత పర్యటన షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో రెండు ఆసియా జట్ల మధ్య మల్టీ-ఫార్మాట్ పోటీలు జరగనున్నాయి. అదనంగా, భారత్-ఆఫ్ఘానిస్తాన్ జట్లు ఒకే ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా తలపడనున్నాయి.

టెస్టుతో న్యూ చండీగఢ్ వేదిక ప్రారంభం..

ఈ పర్యటన జూన్ 6 నుంచి న్యూ చండీగఢ్‌లో జరిగే ఒక్కటే టెస్టు మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. అనంతరం వన్డే సిరీస్‌కు రంగం సిద్ధమవుతుంది.

మూడు వన్డేల సిరీస్ షెడ్యూల్..

జూన్ 14 – తొలి వన్డే – ధర్మశాల

జూన్ 17 – రెండో వన్డే – ఎకానా స్టేడియం

జూన్ 20 – మూడో వన్డే – ఎమ్.ఏ.చిదంబరం స్టేడియం

ఈ సిరీస్ భారత్‌కు ఇంగ్లాండ్ పర్యటనకు ముందు చివరి హోమ్ సిరీస్ కావడం విశేషం. 2027 ప్రపంచకప్‌కు ముందు ఎక్కువగా వన్డే మ్యాచ్‌లు ఆడాలని భారత్ ప్రయత్నిస్తోంది.

ఇంగ్లాండ్ పర్యటన 2026 – వైట్ బాల్ సవాల్..

ఆఫ్ఘానిస్తాన్ సిరీస్ అనంతరం, భారత్ జూలైలో ఇంగ్లాండ్‌కు పర్యటించనుంది. అక్కడ ఐదు టీ20లు, మూడు వన్డేలు జరుగనున్నాయి. 2025లో టెస్ట్ కెప్టెన్సీని ఇంగ్లాండ్ పర్యటనతో ప్రారంభించిన యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) ఈ సారి వన్డే సిరీస్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. గతంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లకు వన్డేల్లో పరాజయాలు చవిచూసిన భారత్‌కు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.

టీ20 సిరీస్ వేదికలు..

జులై 1 – రివర్‌సైడ్ గ్రౌండ్, చెస్టర్-లీ-స్ట్రీట్

జులై 4 – ఓల్డ్ ట్రాఫర్డ్

జులై 7 – ట్రెంట్ బ్రిడ్జ్

జులై 9 – బ్రిస్టల్

జులై 11 – సౌథాంప్టన్

వన్డే సిరీస్ వేదికలు..

జులై 14 – ఎడ్జ్‌బాస్టన్

జులై 16 – సోఫియా గార్డెన్స్

జులై 19 – లార్డ్స్

రోహిత్, కోహ్లీకి కీలకం..

భారత్ లెజెండ్స్ రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) 2027 ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్‌లో పాల్గొనడం దాదాపు ఖాయం అయింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ ప్రపంచకప్‌నకు ముందు వీరికి ఈ వన్డే మ్యాచ్ అనుభవం ఎంతో అవసరం.

ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు దిగ్గజాలు.. వన్డేల్లో పూర్తి దృష్టి పెట్టనున్నారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆఫ్ఘానిస్తాన్‌పై జరిగే వన్డే సిరీస్‌లో వీరు మళ్లీ బ్లూ జెర్సీలో కనిపించనున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us