AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bus Accident: లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి 20 మందికి పైగా తీవ్ర గాయాలు

ఉత్తరఖాండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదపుతప్పడంతో లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 22 మందికీ గాయలయ్యాయి.

Bus Accident: లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి 20 మందికి పైగా తీవ్ర గాయాలు
Bus Falls Into Gorge
Aravind B
|

Updated on: Apr 02, 2023 | 6:28 PM

Share

ఉత్తరఖాండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదపుతప్పడంతో లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 22 మందికీ గాయలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే ఉత్తరఖండ్ ట్రాన్స్ పోర్టు కార్పోరేషన్ కు చెందిన బస్సు ముస్సోరీ నుంచి డెహ్రడూన్ కు వెళ్తోంది. ఈ బస్సులో సుమారు 25 మంది ప్రయాణిస్తు్న్నారు. అయితే షేర్ ఘడి ప్రాంతం దగ్గర్లో బస్సు అదుపు తప్పడంతో సుమారు 100 అడుగుల లోతులో పడిపోయినట్లు తెలుస్తోంది.

సమాచారం తెలుసుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీసులు సహాయంతో గాయపడిన వారిని బయటకు తీశారు. అనంతంరం క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ముస్సోరీ పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమగా ఉందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..