COBRA Commandos: జమ్మూ కశ్మీర్లో తొలిసారిగా రంగంలోకి దిగనున్న కోబ్రా యూనిట్.. ఇక ముష్కరులకు చెమటలు పట్టాల్సిందే..
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్లోకి సీఆర్పీఎఫ్ అత్యున్నత దళమైన కోబ్రా యూనిట్ను రంగలోకి దించుతోంది. అయితే ఇందుకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు పలు కథనాలను బయటపెట్టాయి. అలాగే వామపక్ష ఉగ్రవాదంపై కూడా పోరాడటంలో ఈ కోబ్రా యూనిట్స్కు అపార అనుభవం కలిగిఉంది. గతంలో కూడా ఈ కోబ్రా యునిట్ దళం బిహార్, ఝార్ఖండ్లో విధులు నిర్వహించింది. అయితే ఇప్పుడు జమ్ముకశ్మీర్లోని కుప్వాపాలో ఈ దళం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్లో ఈ దళం శిక్షణ కోసం అక్కడికి వచ్చారు.

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్లోకి సీఆర్పీఎఫ్ అత్యున్నత దళమైన కోబ్రా యూనిట్ను రంగలోకి దించుతోంది. అయితే ఇందుకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు పలు కథనాలను బయటపెట్టాయి. అలాగే వామపక్ష ఉగ్రవాదంపై కూడా పోరాడటంలో ఈ కోబ్రా యూనిట్స్కు అపార అనుభవం కలిగిఉంది. గతంలో కూడా ఈ కోబ్రా యునిట్ దళం బిహార్, ఝార్ఖండ్లో విధులు నిర్వహించింది. అయితే ఇప్పుడు జమ్ముకశ్మీర్లోని కుప్వాపాలో ఈ దళం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్లో ఈ దళం శిక్షణ కోసం అక్కడికి వచ్చారు. అప్పటి నుంచి వారు అక్కడే కొనసాగుతున్నారు. కానీ ఇప్పటిదాకా కూడా ఆ దళానికి ఎలాంటి బాధ్యతలను అప్పగించలేదు కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు వీరిని అక్కడే మోహరింపజేయనున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే అడవుల్లోని ప్రత్యేకమైన గెరిల్లా యుద్ధతంత్రం కోసం కోబ్రా (ది కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్) దళాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అంతేకాదు ఈ సైనికులకు అడవుల్లో కూడా పోరాడటం చేయడంలో మంచి అనుభవం సంపాదించారు. అంతేకాదు ఈ దళ సభ్యులను శిక్షణ సమయంలోనే మానసికంగా, శారీరకంగా అత్యంత కఠినంగా తయారు చేస్తారు. అయితే ఈ దళాలు ఎక్కువ మట్టుకు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లోనే విధులు నిర్వర్తిస్తున్నాయి. అలాగే మరికొన్ని దళాలు మాత్రం ఈశాన్య భారత్లో వేర్పాటు వాదంపై తమ పోరాటాలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్లో ఈరోజు కాల్పులు ఆగిపోయాయి. నిన్న మొత్తం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. అయితే నిన్న భద్రతా దళాలు డ్రోన్లను ఎగరవేసి ఉగ్ర స్థావరాల వద్ద ఉన్నటువంటి మృతదేహాలను గుర్తించాయి. అయితే సోమవారం ఉదయం పూట నుంచి ఎలాంటి కాల్పులు జరగకపోవడంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ఈ క్రమంలోనే కుళ్లిపోయినటుంటి స్థితిలో ఉన్న మృతదేహాన్ని కనిపెట్టింది. అయితే ఇది ఉగ్రస్థావరానికి అత్యంత దగ్గర్లోనే ఈ మృతదేహం పడిఉంది.
ఇదిలా ఉండగా.. మరోవైపు భద్రతా దళాలకు జరిగినటువంటి ప్రాణనష్టానికి తాము కచ్చితంగా ప్రతీకారం తీర్చుకొంటామని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వ్యాఖ్యానించారు. ఇందుకోసం ఉగ్రనాయకులు దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే భద్రతా దళాలపై తమకు పూర్తిగా విశ్వాసం ఉందని అన్నారు. అంతేకాదు.. దేశం మొత్తం వారి వెంటే ఉందని మనోజ్ సిన్హా తెలిపారు. అలాగే జమ్మూకశ్మీర్లో సామాన్యులను అణచివేసిన ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపే సమయం వచ్చిందని స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..