AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి ఊరేగింపులో మృత్యుఘోష.. ట్రాక్టర్ బోల్తా.. 13 మంది మృతి, 15 మందికి గాయాలు..

రాజ్‌గఢ్ జిల్లాలోని పిప్లోడి రోడ్డులో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాకు చెందిన 13 మంది అకాల మరణ వార్త చాలా బాధాకరమన్నారు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. సంఘటనా స్థలంలో కలెక్టర్‌తో పాటు నాయకుడు నారాయణ్‌సింగ్ పన్వార్, ఎస్పీ రాజ్‌గర్ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. తమ ప్రభుత్వ అధికారులు రాజస్థాన్ ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే సమాచారం అందుకున్న రాజస్థాన్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

పెళ్లి ఊరేగింపులో మృత్యుఘోష.. ట్రాక్టర్ బోల్తా.. 13 మంది మృతి, 15 మందికి గాయాలు..
Madhya Pradesh News
Surya Kala
|

Updated on: Jun 03, 2024 | 9:31 AM

Share

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా పిప్లోధిజాద్‌లో ఆదివారం అర్థరాత్రి ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడిన ఘటనలో నలుగురు చిన్నారులు సహా 13 మంది మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 13 మందిని జిల్లా ఆసుపత్రిలో చేర్చినట్లు రాజ్‌గఢ్ జిల్లా మేజిస్ట్రేట్ హర్ష్ దీక్షిత్ తెలిపారు. తలకు, ఛాతీకి తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం భోపాల్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నా.. ప్రాణాపాయం లేదని ఆయన తెలిపారు. రాజస్థాన్ నుంచి వచ్చిన పెళ్లి ఊరేగింపులో వీరు పాల్గొన్నారని స్థానికులు తెలిపారు.

రాష్ట్రపతి, ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మరణించారనే వార్త చాలా బాధాకరమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

రాజ్‌గఢ్ జిల్లాలోని పిప్లోడి రోడ్డులో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాకు చెందిన 13 మంది అకాల మరణ వార్త చాలా బాధాకరమన్నారు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. సంఘటనా స్థలంలో కలెక్టర్‌తో పాటు నాయకుడు నారాయణ్‌సింగ్ పన్వార్, ఎస్పీ రాజ్‌గర్ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. తమ ప్రభుత్వ అధికారులు రాజస్థాన్ ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే సమాచారం అందుకున్న రాజస్థాన్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారు రాజ్‌గఢ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన కొంతమంది రోగులను భోపాల్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సీఎం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

మోహన్ యాదవ్

పెళ్లి ఊరేగింపు రాజస్థాన్ నుంచి ఎంపీకి వెళుతోంది. నిజానికి ఈ ఊరేగింపు రాజస్థాన్‌లోని హర్నవాడ రోడ్డులోని మోతీపురా నుంచి మధ్యప్రదేశ్‌లోని కమల్‌పురా వరకు సాగుతోంది. ఈ రెండు గ్రామాలు రాష్ట్రాల సరిహద్దుకు ఆనుకుని ఉన్నాయి. ఈ ప్రమాదం పిప్లోడా సమీపంలోని ఛాయాన్ రోడ్డులో జరిగింది. ఈ ఊరేగింపులో పెళ్లికి వచ్చిన అతిథులతో నిండిన ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. 13 మంది మరణించారు. 12 మందికి గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతులను, క్షతగాత్రులను అరడజను అంబులెన్స్‌లలో జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..