AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rose Farming: తీవ్రమైన నీటి కొరత ఆ గ్రామంలో రైతులు గులాబీ సాగుబాట పట్టారు.. లక్షల కొద్దీ సంపాదిస్తున్నారు

Rose Farming: ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో.. గులాబీ పువ్వులు అందమైన ప్రేమకు చిహ్నం. కానీ మహారాష్ట్ర (Maharatra)లోని షోలాపూర్ జిల్లా(Solapur district) లో ఉన్న వాడ్జి గ్రామస్థుల(Wadji village)కు మాత్రం.. గులాబీలు..

Rose Farming: తీవ్రమైన నీటి కొరత ఆ గ్రామంలో రైతులు గులాబీ సాగుబాట పట్టారు.. లక్షల కొద్దీ సంపాదిస్తున్నారు
Photo Courtesy Thebetterind
Surya Kala
|

Updated on: Mar 11, 2022 | 10:16 AM

Share

Rose Farming: ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో.. గులాబీ పువ్వులు అందమైన ప్రేమకు చిహ్నం. కానీ మహారాష్ట్ర (Maharatra)లోని షోలాపూర్ జిల్లా(Solapur district) లో ఉన్న వాడ్జి గ్రామస్థుల(Wadji village)కు మాత్రం.. గులాబీలు తమ జీవితాన్ని అందంగా మార్చి.. లక్షాధికారులను చేశాయని చెబుతారు. రాష్ట్రంలోని అత్యంత కరువు పీడిత ప్రాంతాల్లో ఒకటి. అయితే ఇప్పుడు ఆ గ్రామస్థుల విజయానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామంగా వాడ్జి. తమను “గులాబీలు  లక్షాధికారులుగా మార్చాయి” అని గ్రామానికి చెందిన ఒక రైతు కుమార్ చెప్పాడు.

వర్షాధార ప్రాంతం షోలాపూర్ తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీంతో ఈ ప్రాంతంలోని రైతులకు వ్యవసాయం సవాళ్లతో కూడినది. నీటిని తీసుకురావడానికి మైళ్ల దూరం ప్రయాణించవలసి ఉంటుంది. నీటి కొరత ఉన్న ఈ ప్రాంతానికి చెందిన యువకులను పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు కూడా నిరాకరించేవారు. దీంతో చాలామంది  బ్యాచిలర్స్ బాధపడుతున్నారు. “అంతేకాదు.. చాలా మంది రైతులు చెరకును పండిస్తారు. ఈ పంట నీటి-అవసరమైన పంట. లాభాలు తగ్గిపోవడంతో వ్యవసాయం కష్టంగా మారడంతో పంటను పరిమిత సంఖ్యలో పండించడం మొదలు పెట్టారని కుమార్ తమ ప్రాంతం పరిస్థితిని “ది బెటర్ ఇండియా”తో చెప్పాడు .

అయితే కొన్నాళ్లుగా ఆ ఊరు తీరుమారింది. గులాబీ సాగుతో రైతులు లక్షలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఈ రైతుల  ఉత్పత్తులు భారతదేశం అంతటా అమ్ముడవున్నాయి. ఈ స్టేజ్ కు చేరడానికి ఆ గ్రామ రైతులు ఎలా కలిసి పనిచేశారో..  కుండ్లిక్ కుమార్ వివరించారు. గ్రామంలో తీవ్రమైన నీటి సంక్షోభం ఏర్పడినప్పుడు.. ఇతర రైతుల కంటే భిన్నంగా  వ్యవసాయం చేయాలని ఆలోచించారు. దాదాపు 20 మంది రైతులు అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ATMA) అధికారిని సంప్రదించారు. ఇది ప్రగతిశీల వ్యవసాయంలో రైతులకు సహాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకం.

” రైతులు అవలంబించగల ప్రత్యామ్నాయ పంటల సంఖ్యపై మేధోమథనం చేశారు. ఒక రైతు గులాబీ వ్యవసాయం చేస్తున్న మరొక రైతు తాను చేస్తున్న వ్యవసాయ విధానాన్ని పంచుకున్నాడు, ”అని కుండ్లిక్ చెప్పారు.  అలా “1989లో, పొరుగు గ్రామమైన పింజర్‌వాడి నుండి ఒక రైతు అంటు వేసిన గులాబీ మొక్కను తీసుకుని వచ్చాడు. ఆ మొక్కను ప్రచారం చేయడానికి ఉపయోగించాడు. అలా క్రమంగా గులాబీ వ్యవసాయాన్ని ప్రారమ్భహించారు. ఆ రైతు మొదట్లో గులాబీ పంటతో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. కానీ తక్కువ నీటితో పొలంలో పంట పండించాడు. ఇది వాడ్జీలోని రైతులను అనుసరించడానికి ప్రేరేపించింది. “గులాబీ మొక్కలకు ఎక్కువ నిర్వహణ అవసరం లేనందున ఇది ఆచరణాత్మక ప్రత్యామ్నాయంగా అనిపించింది. నీటి అవసరం చాలా తక్కువగా ఉన్న పంట అని కుమార్ చెప్పారు.

అంతేకాకుండా, షోలాపూర్, దాని పొరుగు జిల్లాలోని పర్యాటక స్థలాలను సందర్శించడానికి ఏడాది పొడవునా వందల వేల మంది పర్యాటకులు హాజరవుతారు. లాభసాటిగా మార్కెట్‌ అవకాశాలు ఉన్నాయని ఊహించిన రైతులు గులాబీ సాగు ప్రారంభించారు. మొదట 0.25 ఎకరాల భూమిలో రసాయనిక పద్ధతుల్లో గులాబీ వ్యవసాయం చేయడం ప్రారంభించానని కుమార్ చెప్పాడు. అప్పుడుడు కిలోకు 4 రూపాయల ధర వచ్చింది. మతపరమైన పండగల సమయంలో గులాబీ ధర కిలో రూ. 15 వరకు పెరిగాయని ఆయన చెప్పారు.

కుండ్లిక్‌తో పాటు, పూల పెంపకాన్ని మొదలు పెట్టిన ఇతర రైతులు వ్యాపారంలో లాభాల బాట పట్టారు. దీంతో వాడ్జీ అంతటా గులాబీ పొలాలు 100 ఎకరాల్లో విస్తరించాయి. “స్థానిక మార్కెట్లతో పాటు,  ముంబై, తెలంగాణ, బెంగళూరులకు గులాబీలను ఎగుమతి చేయడం ప్రారంభించారు.

2012-2013లో రైతులు పూణె మార్కెట్‌లో గులాబీ రైతులు వ్యాపారాలు,  మధ్యవర్తుల నుండి భారీ ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. గులాబీ నాణ్యతగా ఉండడంతో డిమాండ్ ఏర్పడింది. దీంతో మార్కెట్ లో గుత్తాధిపత్యాన్ని సృష్టించి తమ వ్యాపారాలను మూసివేస్తామని వారు భయపడ్డారు. అంతేకాకుండా, మధ్యవర్తులు ఎక్కువ కమీషన్లు డిమాండ్ చేయడం ప్రారంభించారు, ”అని ఆయన పేర్కొన్నారు. చివరికి, ఈ గులాబీ రైతులు పూణే మార్కెట్ ను వదులుకున్నారు.

అప్పటికి రైతులు గులాబీల సాగు విస్తీర్ణం 350 ఎకరాలకు పెరిగింది. “ఉత్పత్తి పెద్ద ఎత్తున జరుగుతోంది. దీంతో గులాబీ  ఉత్పత్తులను విక్రయించడానికి రైతులకు నమ్మకమైన మార్కెట్లు అవసరం. అందువల్ల, మార్గదర్శకత్వం కోసం స్థానిక రైతులు మళ్లీ ATMA అధికారులను సంప్రదించారు. గులాబీ పూలను రోజ్ వాటర్, గుల్కంద్, ఎసెన్స్ లతో పాటు  ఇతర ఉత్పత్తులలో ప్రాసెస్ చేయాలని అధికారి సూచించారని కుండ్లిక్ చెప్పారు . రైతులకు మార్కెటింగ్ నైపుణ్యంతో శిక్షణ ఇస్తామని కూడా అధికారి హామీ ఇచ్చారు.

Also Read:

పుతిన్‌ – జెలెన్‌స్కీ సేనల హోరాహోరీ ఫైట్‌.. ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు!