AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rice Side Effects: అన్నం మితంగా తింటే ఔషధం.. అమితంగా తింటే విషం.. డయాబెటిక్ రోగులు అన్నం విషయంలో పాటించాల్సినవి ఇవే

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి కార్భోహైడ్రేట్ల పరిమాణాన్ని పరిశీలించుకోడం తప్పనిసరి. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో అన్నం తిన్న తర్వాత గ్లూకోజ్ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. అధ్యయనాల ప్రకారం టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారు అన్నం తక్కువగా తింటూ ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలను తింటే బెటర్.

Rice Side Effects: అన్నం మితంగా తింటే ఔషధం.. అమితంగా తింటే విషం.. డయాబెటిక్ రోగులు అన్నం విషయంలో పాటించాల్సినవి ఇవే
Rice
Nikhil
|

Updated on: Jun 24, 2023 | 6:15 PM

Share

ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో వరి అన్నాన్ని ప్రధాన ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. మన ఆహారంలో ప్రధాన భాగం అన్నమే ఉంటుంది. వరి అన్నంలో ఎక్కువ కార్భోహైడ్రేట్లు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ఆహారం, జీవనశైలిలో కూడా ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి కార్భోహైడ్రేట్ల పరిమాణాన్ని పరిశీలించుకోడం తప్పనిసరి. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో అన్నం తిన్న తర్వాత గ్లూకోజ్ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. అధ్యయనాల ప్రకారం టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారు అన్నం తక్కువగా తింటూ ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలను తింటే బెటర్. ప్రతి మధుమేహ రోగి రోజువారీ ఆహారంలో కార్భోహైడ్రేట్ల పరిమితిని నిర్ణయించుకోవడం ఉత్తమం. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు తక్కువ అన్నంతో ఎక్కువ కూరను తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. 

షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ బియ్యం మేలు

మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్లో ఉంచుకోవడానికి బ్రౌన్ రైస్, వైల్డ్ రైస్, లాంగ్ గ్రెయిన్ వైట్ రైస్ తీసుకోవడం ఉత్తమం. వీటిల్లో ఎక్కువ ఫైబర్, న్యూట్రియంట్లు, విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా బియ్నాన్ని ఉడికించి అన్నం అయిన తర్వాత మళ్లీ వేడి చేసుకుని తినడం ఉత్తమం. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా తక్కువ పిండి పదార్థాలను విచ్ఛినం చేయడానికి ఉపయోగపడుతుంది. 

అన్నం ఇలా వండితే మేలు

షుగర్ వ్యాధిగ్రస్తులకు అన్నం వండే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మేలని నిపుణులు వెల్లడిస్తున్నారు. బాస్మతి లేదా బ్రౌన్ రైస్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటాయి. ముఖ్యంగా బియ్యం వండే ముందు రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగి ఓ గంటపాటు నానబెట్టాలి. అలాగే అన్నం ఉడుకుతున్న సమయంలో గ్యాస్ ఆఫ్ చేసి బియ్యాన్ని చల్లారనివ్వాలి. అనంతరం మళ్లీ వండాలి. ఈ ప్రక్రియ రెసిస్టెంట్ స్ట్రాచ్‌ను ఏర్పాటును పెంచుతుంది. ఇలా చేయడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా బాగా మేలు చేస్తుంది. 

ఇవి కూడా చదవండి

బియ్యానికి ప్రత్యామ్నాయం ఇవే

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం కోసం అన్నంపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. రోల్డ్ అండ్ స్టీల్ కట్ వోట్స్, బార్లీ, గోధుమ, క్వినోవా, మిల్లెట్, బుక్‌వీట్ వంటి ఆహారాలను తీసుకుంటే మేలని పేర్కొంటున్నారు. 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి