Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Care Tips: మూడ్రోజుల పాటు వరుసగా పండ్లు మాత్రమే తింటే ఏం జరుగుతుందో తెలుసా?

అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పండ్లు ఉత్తమమైన ఆహారం. వీటిని తీసుకోవడం వల్ల మన శరీర అవయవాల ఆరోగ్యానికి మంచిది. ఇది కాకుండా, మంచి చర్మాన్ని పొందడానికి, బరువు తగ్గడానికి కూడా పండ్లు సహాయపడతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, “మనం బరువు తగ్గాలంటే, ముందుగా డిటాక్స్ చేయాలి. కానీ డిటాక్స్ కేవలం నీటితో మాత్రమే కాదు. దానితో పండ్లను కూడా తినాలి. శరీరానికి కావల్సినంత శక్తి అందుతుంది. ఇది శరీరంలోని జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని అందంగా మార్చడంలో సహాయపడుతుంది.

Health Care Tips: మూడ్రోజుల పాటు వరుసగా పండ్లు మాత్రమే తింటే ఏం జరుగుతుందో తెలుసా?
Fruits
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 21, 2023 | 7:23 PM

ఆరోగ్యమే మహా భాగ్యం అనే సామెత మన అందరికీ తెలిసిందే. నేటి ఆధునిక కాలంలో అందరూ ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం పండ్లలో మాత్రమే ఉందని తెలిస్తే మాత్రం షాక్‌ అవుతారు..అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పండ్లు ఉత్తమమైన ఆహారం. వీటిని తీసుకోవడం వల్ల మన శరీర అవయవాల ఆరోగ్యానికి మంచిది. ఇది కాకుండా, మంచి చర్మాన్ని పొందడానికి, బరువు తగ్గడానికి కూడా పండ్లు సహాయపడతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, “మనం బరువు తగ్గాలంటే, ముందుగా డిటాక్స్ చేయాలి. కానీ డిటాక్స్ కేవలం నీటితో మాత్రమే కాదు. దానితో పండ్లను కూడా తినాలి.

బరువు తగ్గడానికి పండు మాత్రమే ఉపవాసానికి ఉత్తమమైనవి. మూడు రోజులపాటు అంటే 72 గంటల పాటు ఉపవాసం ఉంటూ.. పండ్ల తింటే అన్ని ఆరోగ్య సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. ఇవి మీ శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి.

మూడు రోజుల ఫ్రూట్స్‌ డైట్‌ ఎలా పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం…

ఇవి కూడా చదవండి

1వ రోజు: నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీకు ఇష్టమైన, కాలానుగుణమైన పండ్లను తిన్న 12 గంటల తర్వాత, మన శరీరంలోని జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అపానవాయువు, మలబద్ధకం వంటి ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. ఇది కాకుండా, మన శరీరం శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడం ప్రారంభిస్తుంది. ఇది పొట్టకు సంబంధించిన అన్ని సమస్యలను దూరం చేస్తుంది.

2వ రోజు : ఉపవాసం రెండవ రోజున ప్రూట్ డైట్‌ని అనుసరించడం వల్ల మన శరీరంలోని అదనపు కేలరీలు తగ్గుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పండ్లు తీసుకోవడం వల్ల మన శరీరంలో శక్తి ఉత్పత్తి పెరుగుతుంది. ఆకలి బాధలను నివారిస్తుంది. పండ్లలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయదని నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ రకమైన మూడు రోజుల ఉపవాసం తరువాతి రోజుల్లో పోషకాల లోపానికి దారితీస్తుంది.

శరీర కొవ్వును కోల్పోవడానికి మరొక ఉత్తమ మార్గం శారీరక శ్రమ. శారీరక శ్రమను పెంచడం వల్ల అధిక కొవ్వును తగ్గించుకోవచ్చు. కాబట్టి ఎక్కువ శారీరక శ్రమ చేయండి. వ్యాయామం, వాకింగ్‌ కూడా ఎంచుకోవచ్చు.

ఇక మూడవ రోజు: ఉపవాసం మూడవ రోజున పండ్లు తినడం వల్ల మన శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పండ్లలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్ల ప్రభావం వల్ల శరీరానికి కావల్సినంత శక్తి అందుతుంది. ఇది శరీరంలోని జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని అందంగా మార్చడంలో సహాయపడుతుంది.

డిటాక్స్ డైట్‌కి ఇవి బెస్ట్ ఫ్రూట్స్..

నిపుణుల అభిప్రాయం ప్రకారం, బరువు తగ్గడానికి ఫ్రూట్ డిటాక్స్ డైట్ ఉత్తమం. వీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. పండ్లలో బెర్రీలు, యాపిల్స్, ఆరెంజ్, కివీ ఫ్రూట్, దానిమ్మ వంటివి బరువు తగ్గడంలో సహాయపడతాయి.

పండ్లను మాత్రమే తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాలు:

అవును, పండ్లు ఆరోగ్యానికి మంచివి. కానీ పండ్లను మాత్రమే తినడం వల్ల ప్రొటీన్లు, ఐరన్, కాల్షియం, విటమిన్ బి, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ లోపాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఒక్కోసారి ఆకస్మిక బరువు పెరగవచ్చు. దంత సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. కానిస్టేబుల్‌ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం..!
గుడ్‌న్యూస్‌.. కానిస్టేబుల్‌ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం..!
ఇండియా-ఏ తరఫున ఆడనున్న కోహ్లీ, రోహిత్‌ శర్మ!
ఇండియా-ఏ తరఫున ఆడనున్న కోహ్లీ, రోహిత్‌ శర్మ!
అమ్మవారికి నైవేద్యంగా చిరుతిళ్ళు.. ఈ శక్తి పీఠం ఎక్కడ ఉందంటే
అమ్మవారికి నైవేద్యంగా చిరుతిళ్ళు.. ఈ శక్తి పీఠం ఎక్కడ ఉందంటే
రామ్ చరణ్‌కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్
రామ్ చరణ్‌కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్
పైకేమో అందాల భామ.. చేసే పనులేమో అయ్యబాబోయ్ అనేలా..
పైకేమో అందాల భామ.. చేసే పనులేమో అయ్యబాబోయ్ అనేలా..
ఛీ.. ఛీ.. స్పోర్ట్స్‌మెన్‌ స్పిరిట్‌ మరిచి ఇలా చేయాలా?
ఛీ.. ఛీ.. స్పోర్ట్స్‌మెన్‌ స్పిరిట్‌ మరిచి ఇలా చేయాలా?
జేఈఈ మెయిన్‌ 2025 పరీక్ష రాసేవారికి డ్రెస్‌ కోడ్ ఆంక్షలు..
జేఈఈ మెయిన్‌ 2025 పరీక్ష రాసేవారికి డ్రెస్‌ కోడ్ ఆంక్షలు..
ఓటీటీలోకి జీవి ప్రకాష్ సీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ కింగ్ స్టన్.
ఓటీటీలోకి జీవి ప్రకాష్ సీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ కింగ్ స్టన్.
తెలంగాణ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే..
తెలంగాణ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే..
రామ నవమికి ముస్తాబవుతున్న అయోధ్య.. భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలు
రామ నవమికి ముస్తాబవుతున్న అయోధ్య.. భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలు