ఒంటినిండా ముళ్లున్న ఈ పండు ఏడాదికి ఒక్కటి తింటే చాలు.. క్యాన్సర్కు రామబాణం, గుండెకు శ్రీరామరక్ష..!
పూర్తి ప్రయోజనాలు, అప్రయోజనాలను అర్థం చేసుకోవడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. మీ ఆహారంలో లక్ష్మణ ఫలాన్ని చేర్చుకోవడం సులభం. ఈ పండ్లను తాజాగా తినండి, స్మూతీలలో కలుపుకోవచ్చు. లేదంటే జ్యూస్ గా కూడా తీసుకోచ్చు. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఈ పండు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఇది గుండెపోటులను కూడా నివారిస్తుంది.

ప్రకృతి ప్రసాదించిన ఆహార సంపదలో కొన్ని విలువైన రత్నాలు దాగి ఉన్నాయి. వాటి గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు. అలాంటి అద్భుతమైన పండ్లలో ఆకుపచ్చ ముళ్ల పండు ఒకటి. దీనిని ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్కు వ్యతిరేకంగా శక్తివంతమైన ఆయుధంగా పరిగణిస్తున్నారు. దీని పేరు ‘సోర్సోప్’ లేదా ‘గ్రావియోలా’. దీనినే లక్ష్మణ ఫలం, లేదా హనుమాన్ పండు అని కూడా పిలుస్తారు. ముల్లు కలిగి ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పండు బయటి నుండి చూడటానికి గట్టిగా కనిపిస్తుంది. కానీ లోపలి నుండి చూస్తే అది మృదువుగా, జ్యుసిగా, ఉంటుంది. ఆరోగ్యానికి అవసరమైన విలువైన లక్షణాలతో నిండి ఉంటుంది. దీని ఆకులు, పండ్లు, విత్తనాలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడే అద్భుతమైన సామర్థ్యాలను కలిగి ఉంటాయి.
మధ్య, దక్షిణ అమెరికాలో సాంప్రదాయ వైద్యంలో భాగమైన ఈ పండు ఇప్పుడు దాని ఆరోగ్య ప్రయోజనాల కోసం వార్తల్లో నిలిచింది. క్యాన్సర్తో పోరాడటం నుండి గుండెపోటును నివారించడం వరకు దీనికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
లక్ష్మణ పండు స్ట్రాబెర్రీ, అరటిపండు మిశ్రమం లాంటి రుచిని కలిగి ఉంటుంది. దీని గుజ్జు చాలా క్రీమీగా ఉంటుంది. పోషకాల విషయానికొస్తే ఒక కప్పు లక్ష్మణ పండులో 148 కేలరీలు, 7.42 గ్రాముల ఫైబర్, 37.8 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇందులో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉన్నందున, ఇది మధుమేహ రోగులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కడుపు నొప్పి, జ్వరం, పరాన్నజీవి ఇన్ఫెక్షన్లు, అధిక రక్తపోటు వంటి సమస్యలకు చికిత్స చేయడానికి లక్ష్మణ పండును ఉపయోగిస్తారు.
క్యాన్సర్తో పోరాడడంలో లక్ష్మణ పండు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జర్నల్ ఆఫ్ మెడిసినల్ కెమిస్ట్రీలో ప్రచురితమైన ఒక అధ్యయనంలో లాక్టోబాసిల్లస్లోని సమ్మేళనాలు రొమ్ము క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో కీమోథెరపీ కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయని కనుగొన్నారు. 2016లో ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’లో ప్రచురితమైన ఒక అధ్యయనం, ప్రోస్టేట్ క్యాన్సర్పై లక్ష్మణ పండు ప్రభావాన్ని చూపించింది. ఈ అధ్యయనం ఎలుకలపై జరిగింది. 2024 సమీక్షలో లక్ష్మణ పండ్లు క్యాన్సర్ కణాలను చంపే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కనుగొన్నారు. ఇది వాపును తగ్గిస్తుందని చెబుతారు. ఇందులో ఉండే అసిటోజెనిన్లు, ఆల్కలాయిడ్స్ మరియు ఫ్లేవనాయిడ్లు వంటి సమ్మేళనాలు క్యాన్సర్ను నివారించడంలో సహాయపడతాయి.
అయితే, లక్ష్మణ పండు కూడా కొన్ని దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది. 2022 అధ్యయనం ప్రకారం, అధిక స్థాయిలో అసిటోజెనిన్లు నరాలకు విషపూరితం కావచ్చని, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరించింది. దాని పూర్తి ప్రయోజనాలు, అప్రయోజనాలను అర్థం చేసుకోవడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. మీ ఆహారంలో లక్ష్మణ ఫలాన్ని చేర్చుకోవడం సులభం. ఈ పండ్లను తాజాగా తినండి, స్మూతీలలో కలుపుకోవచ్చు. లేదంటే జ్యూస్ గా కూడా తీసుకోచ్చు. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఈ పండు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఇది గుండెపోటులను కూడా నివారిస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..







