AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పల్లీలు తినేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే.. అసలు నిజాలు తెలిస్తే..

ఖరీదైన బాదం పప్పులతో సమానమైన పోషకాలను అతి తక్కువ ధరకే అందించే పేదవాడి బాదం పల్లీలు. వీటిని రోజూ తింటే గుండెకు మంచిది, బరువు అదుపులో ఉంటుంది.. ఇవన్నీ నిజమే. కానీ ఎంత మంచివైనా సరే, మోతాదు మించితే శరీరానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని మీకు తెలుసా? పల్లీలను ఎవరు తినాలి? రోజుకు ఎంత పరిమాణంలో తింటే అమృతంలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

పల్లీలు తినేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే.. అసలు నిజాలు తెలిస్తే..
How Many Peanuts To Eat Daily
Krishna S
|

Updated on: Aug 30, 2026 | 11:05 AM

Share

మన దేశంలో అత్యంత చవకగా లభించే పోషకాహారాలలో పల్లీలు మొదటి వరుసలో ఉంటాయి. వీటిలో ఉండే అపారమైన పోషక విలువల కారణంగా వీటిని పేదవాడి బాదం అని పిలుస్తారు. ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్-ఇ, మెగ్నీషియం, ఫోలేట్, రాగి వంటి పోషకాలు ఇందులో మెండుగా ఉంటాయి. అయితే వీటిని సరైన మోతాదులో, సరైన పద్ధతిలో తీసుకున్నప్పుడే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని, మితిమీరి తింటే అనేక సమస్యలు తలెత్తుతాయని ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ హేమ స్పష్టం చేస్తున్నారు.

వేరుశెనగలతో కలిగే అద్భుత ప్రయోజనాలు

బరువు నియంత్రణ: పల్లీల్లో ఉండే అధిక ప్రొటీన్, ఫైబర్ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి. ఇది అతిగా తినడాన్ని నియంత్రించి బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది.

గుండెకు రక్షణ: ఇందులో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

మెదడు పనితీరు – శక్తి: ఇవి మెదడు చురుకుదనాన్ని పెంచడంతో పాటు వ్యాయామం చేసేవారికి, శారీరక శ్రమ అధికంగా చేసేవారికి తక్షణ శక్తిని అందిస్తాయి.

అన్ని వయసుల వారికీ బలం: పిల్లలు, యుక్తవయస్కులు, వృద్ధులు కొద్ది మోతాదులో నానబెట్టిన లేదా వేయించిన వేరుశెనగలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషణ లభిస్తుంది.

అతిగా తింటే ఎదురయ్యే ముప్పులివే

బరువు పెరగడం: వేరుశెనగల్లో కేలరీలు అధికంగా ఉంటాయి. ప్రతిరోజూ మోతాదుకు మించి తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంది.

అలెర్జీ సమస్యలు: కొంతమందికి వేరుశెనగలు తిన్నప్పుడు శరీరంలో అలెర్జీ చర్యలు జరుగుతాయి. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురద, తీవ్రమైన సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడవచ్చు.

జీర్ణ సమస్యలు: బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు వీటిని ఎక్కువగా తీసుకుంటే గ్యాస్, కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.

ఎలాంటివి తినాలి? ఎలా నిల్వ చేయాలి?

తినాల్సిన పద్ధతి: నూనెలో వేయించిన, అధిక ఉప్పు లేదా మసాలాలు కలిపిన పల్లీలను తినడం మానుకోవాలి. వీటిలో సోడియం, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ. వీటికి బదులుగా రాత్రంతా నీటిలో నానబెట్టినవి, ఉడకబెట్టినవి లేదా నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసిన పల్లీలను ఎంచుకోవాలి.

నిల్వ చేసే విధానం: పల్లీలను తేమ ఉన్న ప్రదేశాలలో నిల్వ చేయకూడదు. తేమ వల్ల బూజు పట్టి అఫ్లాటాక్సిన్ అనే హానికరమైన విషపదార్థం ఏర్పడే ప్రమాదం ఉంది. ఎల్లప్పుడూ నాణ్యమైన పల్లీలను కొని, పొడిగా ఉండే గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేయాలి.

రోజుకు ఎంత మోతాదులో తీసుకోవాలి?

ఆరోగ్యంగా ఉన్న ఒక సాధారణ వ్యక్తి రోజుకు గుప్పెడు వేరుశెనగలను తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలర్జీలు లేదా తీవ్రమైన జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకునే ముందు వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్టును సంప్రదించడం మంచిది.

Follow Us
పల్లీలు తినేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే..
పల్లీలు తినేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే..
గుట్టలపై దాగిన 400 ఏళ్ల రహస్యం!
గుట్టలపై దాగిన 400 ఏళ్ల రహస్యం!
రెప్ప పాటులో లాక్కెళ్లిన రాకాసి అలలు.. వాళ్లే గనుక లేకుంటే...!
రెప్ప పాటులో లాక్కెళ్లిన రాకాసి అలలు.. వాళ్లే గనుక లేకుంటే...!
స్పూన్ తింటే నడవలేని వాళ్ళు కూడా రేసు గుర్రంలా ఉరుకులు పెడతారు
స్పూన్ తింటే నడవలేని వాళ్ళు కూడా రేసు గుర్రంలా ఉరుకులు పెడతారు
అప్పుడు ఎత్తుకుని పెంచాం.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు..
అప్పుడు ఎత్తుకుని పెంచాం.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు..
ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ తప్పులు చేయకపోతే మీ భవనం పదిలం
ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ తప్పులు చేయకపోతే మీ భవనం పదిలం
హిమాలయాల్లో భారత ఆర్మీ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్!
హిమాలయాల్లో భారత ఆర్మీ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్!
సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో జర్నీ చేసిన టీమిండియా దిగ్గజం..!
సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో జర్నీ చేసిన టీమిండియా దిగ్గజం..!
వర్షాకాలంలో గులాబీలు పూలతో కళకళలాడాలంటే.. సింపుల్ టిప్స్ పాటిస్తే
వర్షాకాలంలో గులాబీలు పూలతో కళకళలాడాలంటే.. సింపుల్ టిప్స్ పాటిస్తే
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..