AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిందూ ధర్మంలో ప్రతి సంప్రదాయానికి సైంటిఫిక్ రీజన్ ఉందా..! వివాహ స్త్రీ మెట్టెలు ధరించడం వెనుక కారణం ఏమిటో తెలుసా..!

హిందూ సంప్రదాయంలో పెళ్లి అయిన మహిళలు తప్పనిసరిగా మట్టిగాజులు, ముక్కుపుడక, కాళ్లకు మెట్టెలు, మేడలో తాళి ధరించాలి వంటి నియమాలను మన పూర్వీకులు సంప్రదాయాలుగా పెట్టారు...

హిందూ ధర్మంలో ప్రతి సంప్రదాయానికి సైంటిఫిక్ రీజన్ ఉందా..! వివాహ స్త్రీ మెట్టెలు ధరించడం వెనుక కారణం ఏమిటో తెలుసా..!
Hindu Women Wearing Toe Rin
Surya Kala
|

Updated on: Mar 16, 2021 | 12:45 PM

Share

Indian Married Woman Mettelu: హిందూ సంప్రదాయంలో పెళ్లి అయిన మహిళలు తప్పనిసరిగా మట్టిగాజులు, ముక్కుపుడక, కాళ్లకు మెట్టెలు, మేడలో తాళి ధరించాలి వంటి నియమాలను మన పూర్వీకులు సంప్రదాయాలుగా పెట్టారు. హిందూ ధర్మంలో పెళ్ళైన స్త్రీలను లక్ష్మి దేవిగా భావిస్తారు. పెళ్లి అయిన మహిళ నిత్యం ధరించే బొట్టు,పూలు, గాజులు, తాళి, మెట్టెలు అన్నీ కలిసి లక్ష్మి దేవె అనిపిస్తుంది కూడా.. ఆయితే స్త్రీ ధరించే ప్రతిదానికి వెనుక పరమార్ధం ఉంది.. అయితే మెట్టెలు ధరించడం వెనక ఉన్న మరిన్ని సైంటిఫిక్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

అవును పెద్దలు పెట్టిన హిందూ సంప్రాయాల వెనుక ఖచ్చితంగా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. చెవులు, ముక్కుపుడక గాజులు ఇలా ప్రతి ఒక్కదానికి వెనుక ఒక మంచి ఫలితం.. మహిళలకు మేలు కలిగించే ప్రయోజనం తప్పని సరిగా ఉంది.

* కాలి బొటనవేలు పక్కనున్న వేలు స్త్రీలకూ ఆయువు పట్టు వంటిది. దాని నుంచి విద్యుత్ ప్రసరిస్తుంటుంది. కనుక ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదని… అలా తగలకుండా ఉండటానికే మెట్టెలు ధరించే సంప్రదాయం వచ్చింది.

* కాలి రెండవ వేలి నుండి ఓ ప్రత్యేక నరం గర్భాశయానికి సంధి చేయబడి గుండె వరకు వెళుతుంది. కాలికి మెట్టెలు ధ‌రించ‌డం వ‌ల్ల ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి వారి గుండె నుంచి గ‌ర్భాశ‌యానికి ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ట‌. దీంతో వారి రుతు క్ర‌మం స‌రిగ్గా ఉంటుంద‌ట‌. ఈ వేలికి మెట్టె పెట్టుకోవడం వల్ల గర్భాశయం ధృఢపడుతుంది.

* వెండి మెట్టెలు ధ‌రిస్తే ప్ర‌కృతిలో ఉన్న పాజిటివ్ ఎన‌ర్జీ వారి శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంద‌ట‌.

*మెట్టెలు వెండితో చేసినవి ధరిస్తారు.. వెండి మంచి ఉష్ణ వాహకం కావడం వల్ల..భూమి నుండి ధనావేశాలను గ్రహించి శరీరమునకు ప్రసరింపజేస్తుంది..అందుకే వెండితో చేసిన మెట్టలను మన భారతీయ స్త్రీలు కాలి రెండవ వేలుకు ధరిస్తారు.

*స్త్రీలు వారి చేతికి వేసుకొనే గాజులు, కాళీ మెట్టలు రెండు కూడా సంతానాబివృద్ధికి, సుఖ ప్రసవం అవడానికి అనుకూలించే నాడులను సున్నితంగా నొక్కుతు ఉంటాయి.

అందువల్ల మన పూర్వికులు వధువుకి కాళ్ల మెట్టలు ధరించడం సంప్రదాయంగా చేర్చారు. ఈ మెట్టలు వధువుకి వివాహిత అని చెప్పే మరో గుర్తు. వివాహతంతులో వధువు పాదాన్ని రోకలిపై ఉంచి వరుడు వధువు కాలి వేలుకి తోడుగుతాడు. వీటిని ఒక్కక్క ప్రాంతంలొ ఓక్కలా తొడుగుతారు. కొన్ని చోట్ల వదువు పుట్టింటి వాళ్ళు తొడిగితే మరి కొన్ని చోట్ల మెట్టినింటివారు పెడతారు.

అయితే పెళ్ళైన స్త్రీకి మెట్టెలు పెట్టాడని పురాణాల్లో ఉన్న కథ ప్రకారం దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుడిని అవమానిస్తాడు. తన భర్తకు జరిగిన అవమానాన్ని చూసి కోపోద్రిక్తురాలైన దాక్షాయణి… తన కాలివేలిని భూమిపై రాసి నిప్పు పుట్టించి.. ఆత్మాహుతి చేసుకుందని కథనం. దీనిని అనుసరించే పై నమ్మకం ఏర్పడింది. అందుకే వివాహిత స్త్రీలు మెట్టెలు పెట్టుకునే ఆచారం వచ్చింది. భర్త అనురాగం పెరగటానికి సంతానభాగ్యానికి సిరిసంపదలు పొందటానికి వ్యాధులు రాకుండావుండటానికి ఈనియమాలు పాటించమని పెద్దలు పెట్టిన నియమాల్లో ఒకటి మెట్టెలు.

Also Read:

త్రిస్సూర్ పూరం ఉత్సవాలకు అనుమతినిచ్చిన కేరళ ప్రభుత్వం.. కండిషన్స్ అప్లై

 “తొలి అనుభావాన్ని” పంచుకున్న ఇషాన్‌ కిషన్.. కోహ్లీ చెబితే కానీ అర్థం కాలేదు..

Follow Us