AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salt: వామ్మో.. ఉప్పు తింటే క్యాన్సర్ వస్తుందా.? పరిశోధనల్లో భయంకర విషయాలు

అయితే వీటన్నింటికీ మించి మరో పెద్ద సమస్య కూడా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణాశయ క్యాన్సర్‌ ముప్పు పెరిగే అవకాశం ఉందని తాజా పరిశోధనల్లో తేలింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిలో...

Salt: వామ్మో.. ఉప్పు తింటే క్యాన్సర్ వస్తుందా.? పరిశోధనల్లో భయంకర విషయాలు
Salt
Narender Vaitla
|

Updated on: Sep 09, 2024 | 3:07 PM

Share

ఉప్పు లేనిది రోజు గడవని పరిస్థితి. కచ్చితంగా ప్రతీ కూరలో ఉప్పు వేసుకోవాల్సిందే. ఉప్పు లేని కూరను ఊహించుకోవడం కూడా అసాధ్యం. అయితే ఇంతలా ఉపయోగపడే ఉప్పు ఎన్నో సమస్యలకు సైతం కారణమవుతుందని తెలిసిందే. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బీపీ పెరుగుతుంది. గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. అలాగే దాహం పెరుగుతుంది. శరీరంలో డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది, కిడ్నీ సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.

అయితే వీటన్నింటికీ మించి మరో పెద్ద సమస్య కూడా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణాశయ క్యాన్సర్‌ ముప్పు పెరిగే అవకాశం ఉందని తాజా పరిశోధనల్లో తేలింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిలో కనిపిస్తున్న క్యాన్సర్స్‌లో జీర్ణాశయ క్యాన్సర్‌ ఐదో స్థానంలో ఉంది. దీంతో అసలు ఈ క్యాన్సర్‌ ఎందుకు వస్తుందన్న దానిపై నిపుణులు పరిశోధనలు చేపడుతూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. తరచూ కూరలో ఉప్పు అదనంగా వేసుకొని తినే వారిలో పొట్ట క్యాన్సర్‌ ముప్పు 41% ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణాశయం లోపల జిగురుపొర దెబ్బ తింటుందని పరిశోధనల్లో తేలింది. ఇది కడుపులో హెలికోబ్యాక్టర్‌ పైలోరీ బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కడుపులో ఇన్ఫెక్షన్‌ తలెత్తడానికి కారణం అవుతుందని పరిశోధనల్లో తేలింది. అదే విధంగా జీర్ణాశయ పైపొర కణాలను దెబ్బ తినడానికి కూడా ఇది కారణమవుతుందని. కాల క్రమేణ ఇది క్యాన్సర్‌ ముప్పు పెరిగేందుకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో జీర్ణాశయ క్యాన్సర్‌ ముప్పు తగ్గాలంటే ఉప్పు తీసుకోవడాన్ని వీలైనంత వరకు తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కూరల్లో పై నుంచి ఉప్పు వేసుకోవడం పూర్తిగా మానేయాలని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..