AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భోజనం చేసిన ఎన్ని నిమిషాలకు నీరు తాగాలి? ఆయుర్వేదం చెప్పే గోల్డెన్ సీక్రెట్స్ ఇవే..

మీ ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఆయుర్వేదం.. నీరు త్రాగడం నుండి ఆహారం ఎంచుకోవడం.. తినే పద్ధతుల వరకు ప్రతిదీ వివరిస్తుంది. వీటి గురించి తెలుసుకోవడం మంచిదని.. దీని ద్వారా ఆరోగ్యాన్ని మరింత మెరుగుర్చుకోవచ్చిని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.

భోజనం చేసిన ఎన్ని నిమిషాలకు నీరు తాగాలి? ఆయుర్వేదం చెప్పే గోల్డెన్ సీక్రెట్స్ ఇవే..
Water After Meals
Shaik Madar Saheb
|

Updated on: Aug 19, 2025 | 11:01 AM

Share

నేటి బిజీ జీవితంలో, ప్రజలు తరచుగా తమ ఆహారపు అలవాట్లను విస్మరిస్తారు. ఫలితంగా జీర్ణ సమస్యలు క్రమంగా తీవ్రమైన వ్యాధుల రూపాన్ని సంతరించుకుంటాయి. అటువంటి పరిస్థితిలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇటీవల ఆయుర్వేదం ఆధారంగా కొన్ని బంగారు నియమాలను పంచుకుంది. ఇందులో పేర్కొన్న చిన్న జీవనశైలి మార్పుల ద్వారా, జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు.

ఆహారం తినడానికి సరైన మార్గం

ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఆయుర్వేదం మనం ఏమి తినాలో చెప్పడమే కాకుండా, ఎలా.. ఎప్పుడు తినాలో కూడా నేర్పుతుంది. తినేటప్పుడు ప్రశాంతమైన వాతావరణం, సానుకూల ఆలోచన, మంచి సహవాసం ఉండటం ముఖ్యం. కోపం, భయం, ఒత్తిడి వంటి ప్రతికూల భావోద్వేగాలు జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

ఆహారాన్ని నెమ్మదిగా నమలండి..

ఆహారాన్ని నెమ్మదిగా నమలడం వల్ల దాని రుచి మెరుగుపడటమే కాకుండా జీర్ణ ఎంజైమ్‌లను కూడా సక్రియం చేస్తుంది. ఇది ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. గ్యాస్, అజీర్ణం వంటి కడుపు సమస్యలను నివారిస్తుంది.

ఇవి కూడా చదవండి

నీరు త్రాగడానికి సరైన మార్గం..

ఆయుర్వేదం ప్రకారం.. భోజనం చేస్తున్నప్పుడు గుటకలుగా నీరు త్రాగడం ప్రయోజనకరం.. కానీ భోజనం ముగిసిన వెంటనే నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. జీర్ణక్రియ ప్రక్రియ సరిగ్గా జరగాలంటే భోజనం తర్వాత 40 నుండి 45 నిమిషాల తర్వాత నీరు త్రాగాలి.

కాలానుగుణ ఆహారాలు తినండి..

ఆయుర్వేదం ఆహారం తాజాగా, కాలానుగుణంగా ఉండాలని నొక్కి చెబుతుంది. ఆహారాన్ని ఎంచుకునేటప్పుడు శరీర స్వభావాన్ని కూడా గుర్తుంచుకోవడం ముఖ్యం. దీనితో పాటు, రాత్రి భోజనం తేలికగా ఉండాలి.. త్వరగా తినాలి. తద్వారా నిద్రపోయే ముందు శరీరం జీర్ణం కావడానికి తగినంత సమయం లభిస్తుంది.

భారీ భోజనం మానుకోండి

భారీ – నూనె పదార్థాలు జీర్ణవ్యవస్థపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి.. ఇది గ్యాస్, అసిడిటీ, ఇతర సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి రోజులో ప్రధాన భోజనం మధ్యాహ్నం చేసి, రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నిరుద్యోగులకు అలర్ట్.. RRB ఏఎల్‌పీ ఆన్సర్ కీ విడుదల! లింక్ ఇదే
నిరుద్యోగులకు అలర్ట్.. RRB ఏఎల్‌పీ ఆన్సర్ కీ విడుదల! లింక్ ఇదే
దిమ్మదిరిగే షాకిచ్చిన చమురు కంపెనీలు.. భారీగా పెరిగిన డీజిల్ ధర
దిమ్మదిరిగే షాకిచ్చిన చమురు కంపెనీలు.. భారీగా పెరిగిన డీజిల్ ధర
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుంది!
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుంది!
తరచూ జీవిత భాగస్వామితో గొడవలా?.. గరుడపురాణం చెప్పే షాకింగ్ ఫాక్ట్
తరచూ జీవిత భాగస్వామితో గొడవలా?.. గరుడపురాణం చెప్పే షాకింగ్ ఫాక్ట్
అఫీషియల్.. సాయి పల్లవితో మణిరత్నం కొత్త సినిమా.. హీరో ఎవరంటే?
అఫీషియల్.. సాయి పల్లవితో మణిరత్నం కొత్త సినిమా.. హీరో ఎవరంటే?
కన్నీరు పెడుతున్న మంజీరమ్మ.. వేలాది చేపలు మృతి!
కన్నీరు పెడుతున్న మంజీరమ్మ.. వేలాది చేపలు మృతి!
మరీ ఇంత కుళ్లా.. ఆ కారణంతో ఐపీఎల్ ఆడమంటూ బెదిరింపులు?
మరీ ఇంత కుళ్లా.. ఆ కారణంతో ఐపీఎల్ ఆడమంటూ బెదిరింపులు?
మేష రాశిలో శుక్రుడు.. ఆ రాశుల వారికి సిరిసంపదలు, భోగభాగ్యాలు..!
మేష రాశిలో శుక్రుడు.. ఆ రాశుల వారికి సిరిసంపదలు, భోగభాగ్యాలు..!
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు 2026 ప్రారంభం.. డైరెక్ట్ లింక్
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు 2026 ప్రారంభం.. డైరెక్ట్ లింక్
ఏడాదికి రూ.1.5 లక్షలు మాత్రమే పెట్టుబడి..కానీ చేతికి రూ.70 లక్షలు
ఏడాదికి రూ.1.5 లక్షలు మాత్రమే పెట్టుబడి..కానీ చేతికి రూ.70 లక్షలు