AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nutmeg Water: మీరూ మైగ్రేన్‌తో బాధపడుతున్నారా..? ఉదయాన్నే పరగడుపున దీన్ని నీళ్లలో చిటికెడు కలిపి గ్లాసుడు తాగితే..

ఆరోగ్యానికి మేలు చేసే ఆయుర్వేద మూలికల్లో జాజికాయ ఒకటి. ఇది వంటలకు ప్రత్యేక రుచిని తీసుకురావడమే కాకుండా ఆరోగ్యినికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఈ కాయ పొడిని గ్లాసుడు నీళ్లలో చిటికెడు కలిపి రోజూ ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఇట్టే చెక్ పెట్టొచ్చు..

Nutmeg Water: మీరూ మైగ్రేన్‌తో బాధపడుతున్నారా..? ఉదయాన్నే పరగడుపున దీన్ని నీళ్లలో చిటికెడు కలిపి గ్లాసుడు తాగితే..
Nutmeg
Srilakshmi C
|

Updated on: Jan 23, 2025 | 1:42 PM

Share

జాజికాయ గురించి చాలా మంది వినే ఉంటారు. దీనిని సాధారణంగా వివిధ రకాల ఆహారాల తయారీలో ఉపయోగిస్తుంటారు. అంతే కాకుండా ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. జాజికాయలో పోషకాలు పుష్కలంగా ఉన్నందున దీని వినియోగం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, కాపర్ అధిక మోతాదులో ఉంటాయి. అలాగే జాజికాయ పొడి కలిపిన నీరు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జాజికాయ పొడిని నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

జీర్ణ శక్తిని పెంచుతుంది

జాజికాయ పొడిని నీటితో కలిపి ఖాళీ కడుపుతో తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జాజికాయలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి కడుపు సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. జాజికాయ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

మైగ్రేన్ నుంచి ఉపశమనం

జాజికాయలో నొప్పిని తగ్గించే గుణాలు ఉన్నాయి. ఇది తలనొప్పి, మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. కాబట్టి ఈ జాజికాయ నీటిని రోజూ ఉదయాన్నే తాగడం వల్ల తలనొప్పి, మైగ్రేన్ లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

హానికరమైన ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది

జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇది బయటి నుండి వచ్చే హానికరమైన ఇన్ఫెక్షన్లతో పోరాడే శరీర సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఇది ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం తగ్గిస్తుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది

జాజికాయలోని ట్రిప్టోఫాన్ వంటి సహజ సమ్మేళనాలు మెదడుపై ఒత్తిడిని తగ్గించి, శరీరం, మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. కాబట్టి ఖాళీ కడుపుతో జాజికాయ నీటిని తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. కాబట్టి నిద్రలేమితో బాధపడేవారికి, రోజూ మాత్రలు వేసుకునే అలవాటు ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది.

చర్మ సమస్యలను తగ్గిస్తుంది

జాజికాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది మొటిమలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి జాజికాయ నీటిని తాగడం వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. అలాగే జాజికాయ పొడి కలిపిన నీరు తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి. చర్మం ముడతలు రాకుండా ఉంటుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.