Mutton Paya: సీక్రెట్ చిట్కాలతో పురానీ ఢిల్లీ స్పెషల్ ‘మటన్ పాయా’.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!
Purani Delhi Mutton Paya: పురానీ దిల్లీ ముస్లిం స్టైల్ మటన్ పాయా వంటకం చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీని ఎవరైనా సులభంగా తయారు చేయవచ్చు. వంట కొత్తగా నేర్చుకుంటున్న వారు సైతం సరైన చిట్కాలను పాటిస్తే అద్భుతమైన పాయాను వండగలుగుతారు. దీనికి కాస్త..

Purani Delhi Mutton Paya: పురానీ దిల్లీ ముస్లిం స్టైల్ మటన్ పాయా తయారీ విధానం చాలా సులభం, కానీ అద్భుతమైన రుచిని అందిస్తుంది. ఈ రెసిపీని వంటరాని వారు కూడా సరైన చిట్కాలతో పర్ఫెక్ట్గా చేయవచ్చు. నాన్, దోశ, పూరీ, చపాతి లేదా అన్నంతో ఇది స్వర్గమే అనిపిస్తుంది. ఈ వంటకానికి ఓపికతో పాటు నాణ్యమైన పదార్థాలు, సరైన విధానం అవసరం.
ముందుగా, ఒక కుక్కర్లో అరకప్పు నూనె వేడి చేసుకోవాలి. ఈ వంటకానికి నూనె ఎక్కువగా అవసరం ఉంటుందని గుర్తించుకోండి. నూనె వేడెక్కాక, పావు చెంచా మిరియాలు, ఒక ఇంచ్ దాల్చిన చెక్క, నాలుగు యాలకులు, ఐదు లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. తర్వాత మూడు పెద్ద ఉల్లిపాయల పేస్ట్ (సుమారు పావు కిలో) వేసి, ఓపికగా మీడియం ఫ్లేమ్పై ఉల్లిపాయల్లోని నీరంతా పోయి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇది పాయాకు మంచి రంగు, రుచి, చిక్కదనాన్ని ఇస్తుంది. ఈ దశ అత్యంత కీలకం.
ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి రాగానే, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు, పావు చెంచా పసుపు, అర టీ స్పూన్ మిరియాల పొడి వేసి మసాలాలన్నింటినీ బాగా వేపుకోవాలి. మసాలాలు మాడకుండా జాగ్రత్త పడాలి. రుచికి తగ్గట్లు ఉప్పు, కారాలను అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు 300 గ్రాముల పాయా బోన్స్ను వేసుకోవాలి. ఈ బోన్స్ను నాలుగైదు సార్లు శుభ్రంగా కడగాలి. సరిగ్గా కడగకపోతే నీచు వాసన వస్తుందని గుర్తించుకోండి. బోన్స్ను మసాలాలతో హై ఫ్లేమ్పై బాగా పట్టించాలి. ఆ తర్వాత 200 మి.లీ. నీళ్లు పోసి, బాగా కలిపి మీడియం ఫ్లేమ్పై నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి. నూనె పైకి తేలడం అనేది బోన్స్ బాగా ఉడికి, రుచిగా ఉండటానికి, నీచు వాసన రాకుండా ఉండటానికి ముఖ్యమైన దశ. తొందరపడి హై ఫ్లేమ్పై చేసేస్తే పాయా నీచు వాసన వచ్చే అవకాశం ఉంది.
నూనె పైకి తేలాక, 500 మి.లీ. నీళ్లు పోసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి, తక్కువ మంటపై నాలుగు విజిల్స్, ఆపై మీడియం ఫ్లేమ్పై రెండు విజిల్స్ రానివ్వాలి. పాయా ఎంత నిదానంగా ఉడికితే అంత రుచిగా ఉంటుంది. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి చూడగా, పాయా బోన్స్ ఎంతో మృదువుగా, పర్ఫెక్ట్గా ఉడికి ఉంటాయి.
చివరిగా, 250 మి.లీ. నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్పై ఒక పొంగు రానివ్వాలి. ఈ సమయంలో రెండు కారంగా ఉన్న పచ్చిమిర్చి తరుగు, ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, అరచెక్క నిమ్మరసం పిండి బాగా కలిపి దించేయాలి. వేడిమీద కాస్త పలుచగా అనిపించినా, చల్లారేసరికి సరైన చిక్కదనంలోకి వస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
