AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాణం తీసిన వివాహేతర బంధం

వివాహేతర బంధం మహిళ ప్రాణాల మీదకు వచ్చింది. యాదాద్రి-భువనగిరి జిల్లాలోని భువనగిరి బై పాస్ రోడ్డు పక్కన గుట్టల్లో లక్ష్మి (35) అనే మహిళ దారుణ హత్యకు గురైంది.

ప్రాణం తీసిన వివాహేతర బంధం
Balaraju Goud
|

Updated on: Nov 12, 2020 | 11:14 AM

Share

వివాహేతర బంధం మహిళ ప్రాణాల మీదకు వచ్చింది. యాదాద్రి-భువనగిరి జిల్లాలోని భువనగిరి బై పాస్ రోడ్డు పక్కన గుట్టల్లో లక్ష్మి (35) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఆ మహిళను హత్య చేసిన అనంతరం ప్రియుడు కుమార్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్ద మండర్ గ్రామానికి చెందిన లక్ష్మీ భర్త చనిపోవడంతో కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. అయితే విజయ్ అనే మరో యువకుడితో మహిళ చనువుగా ఉండటం కుమార్ భరించలేకపోయాడు. మహిళ విజయ్ తో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో లక్ష్మీని కుమార్ హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితుడి సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.