AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరవింద్‌ కేజ్రీవాల్‌ సర్కార్‌పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం, మొద్దు నిద్రపోయారంటూ అసహనం!

ఢిల్లీ ప్రభుత్వంపై అక్కడి హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.. నాలుగైదు అక్షింతలు కూడా వేసింది.. కరోనా కేసులు ఇంతగా పెరుగుతున్నా చర్యలు ఎందుకు చేపట్టలేదంటూ మండిపడింది..

అరవింద్‌ కేజ్రీవాల్‌ సర్కార్‌పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం, మొద్దు నిద్రపోయారంటూ అసహనం!
Balu
|

Updated on: Nov 19, 2020 | 4:16 PM

Share

ఢిల్లీ ప్రభుత్వంపై అక్కడి హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.. నాలుగైదు అక్షింతలు కూడా వేసింది.. కరోనా కేసులు ఇంతగా పెరుగుతున్నా చర్యలు ఎందుకు చేపట్టలేదంటూ మండిపడింది.. కరోనాతో మరణించిన వారి కుటుంబసభ్యులకు ఏమని సమాధానం చెబుతారు? అంటూ నిలదీసింది.. రోజురోజుకీ వైరస్‌ పెరుగుతూ ఉంటే ఎందుకు అలెర్ట్‌ కాలేదంటూ ప్రశ్నించింది. వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొనే అతిథుల సంఖ్యను తాము పట్టించుకునేంత వరకు ఎందుకు తగ్గించలేదని నిలదీసింది హైకోర్టు. ఢిల్లీలో కరోనా పరీక్షలను పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాకేశ్‌ మల్హోత్రా అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై డిల్లీ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. కరోనాపై ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఈ నెల ఒకటి నుంచి కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందుతూ ఉన్నదని సంగతి మీకు తెలుసు.. కేసుల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతున్న విషయమూ తెలుసు.. అయినా కోర్టు జోక్యం చేసుకునేంత వరకు చర్యలు ఎందుకు చేపట్టలేదు’ అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది న్యాయస్థానం.. పరిస్థితి చేయిదాటేంతవరకు మొద్దు నిద్రపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.. వివాహ వేడుకలకు హాజరయ్యే అతిథుల సంఖ్యను 50కి తగ్గించేందుకు ఇంతకాలం ఎందుకు ఎదురుచూడాల్సి వచ్చిందని ప్రశ్నిస్తూనే ఈ 18 రోజులలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో తెలుసా? అంటూ నిలదీసింది.. చనిపోయినవారి కుటుంబ సభ్యులకు ఏం చెబుతారు ? అంటూ ప్రభుత్వాన్ని కడిగిపారేసింది. అలాగే కోవిడ్‌-19 నిబంధనలపై కూడా ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మాస్క్‌లు ధరించనివారిపైనా, భౌతికదూరం పాటించనివారిపైనా జరిమానాలు విధిస్తే సరిపోదని, కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. కరోనా కేసుల సంఖ్య విషయంలో న్యూయార్క్‌, సావోపాలో వంటి నగరాలను ఢిల్లీ ఏనాడో దాటేసిందని చురకలేసింది.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని భూతద్దంలోంచి చూడాలని ఘాటుగా చెప్పింది..

Follow Us
పటాన్‌చెరు సమీపంలో ఓ చెరువులో కనిపించిన భయానక దృశ్యం,వణికిపోతున్న
పటాన్‌చెరు సమీపంలో ఓ చెరువులో కనిపించిన భయానక దృశ్యం,వణికిపోతున్న
పెద్ది సినిమాలో ఆ ఎపిసోడ్ ఇష్టం.. సీక్రెట్ రివీల్ చేసిన చరణ్..
పెద్ది సినిమాలో ఆ ఎపిసోడ్ ఇష్టం.. సీక్రెట్ రివీల్ చేసిన చరణ్..
తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌!
తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌!
వార్నీ ఇంత చీపా.. 1984లో మారుతి 800 కారు ధర ఎంతో తెలిస్తే ..
వార్నీ ఇంత చీపా.. 1984లో మారుతి 800 కారు ధర ఎంతో తెలిస్తే ..
ఒత్తైన, మెరిసే జుట్టు మీ సొంతం కావాలా? పెరుగుతో ఇలా హెయిర్ ప్యాక్
ఒత్తైన, మెరిసే జుట్టు మీ సొంతం కావాలా? పెరుగుతో ఇలా హెయిర్ ప్యాక్
60 ఏళ్లు.. 700కు పైగా సినిమాలు.. ఈ నటి ఎవరంటే..
60 ఏళ్లు.. 700కు పైగా సినిమాలు.. ఈ నటి ఎవరంటే..
తడి పాదాలతో నిద్రపోవద్దంటారు ఎందుకు..? లక్ష్మీ కటాక్షం తగ్గి..
తడి పాదాలతో నిద్రపోవద్దంటారు ఎందుకు..? లక్ష్మీ కటాక్షం తగ్గి..
రవి బాబు తల్లి ఎలా చనిపోయారో తెలుసా? పాపం అతని కళ్ల ముందే..
రవి బాబు తల్లి ఎలా చనిపోయారో తెలుసా? పాపం అతని కళ్ల ముందే..
వాషింగ్ మెషీన్‌లో సర్ఫ్ వాడుతున్నారా..? అసలు ఏది వేస్తే మంచిదో..
వాషింగ్ మెషీన్‌లో సర్ఫ్ వాడుతున్నారా..? అసలు ఏది వేస్తే మంచిదో..
నీతి కథ: నక్క కుతంత్రానికి ఒంటె బలి.. దుష్టుల సావాసంతో కీడు
నీతి కథ: నక్క కుతంత్రానికి ఒంటె బలి.. దుష్టుల సావాసంతో కీడు