AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్ వేళ.. స్మశానం అడ్డాగా.. మందుబాబుల హవా..!

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో బెంగళూరులోని మందుబాబులు పార్టీలు చేసుకొనేందుకు ఓ సరికొత్త ప్రదేశాన్ని ఎంచుకున్నారు. నగరంలోని స్మశానాలను అడ్డాలుగా

లాక్‌డౌన్ వేళ.. స్మశానం అడ్డాగా.. మందుబాబుల హవా..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 10, 2020 | 1:08 PM

Share

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో బెంగళూరులోని మందుబాబులు పార్టీలు చేసుకొనేందుకు ఓ సరికొత్త ప్రదేశాన్ని ఎంచుకున్నారు. నగరంలోని స్మశానాలను అడ్డాలుగా మార్చుకొని.. వాళ్లు పార్టీలు చేసుకుంటున్నారు. తాగిన వ్యక్తులు తిన్నగా ఉండకుండా గొడవలకు దిగి.. ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసి పోలీసులే షాక్ అయ్యారు.

వివరాల్లోకెళితే.. శాంతినగర్ ప్రాంతంలోని స్మశానంలో మద్యం మత్తులో కొందరు వ్యక్తుల మధ్య ఘర్షణలో ఓ వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడటంతో.. అతను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంతినగర్‌లోని అక్కితిమనహళ్లికి చెందిన సురేశ్ అబాస్తీ, అతని స్నేహితుడు అప్పు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో బీర్లతో స్థానిక స్మశానానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ నలుగురు వ్యక్తులు ఫుల్‌గా పార్టీ చేసుకుంటున్నారు. అక్కడకు వచ్చిన సురేశ్, అప్పులను వాళ్లు వెళ్లిపోమన్నారు.

కాగా.. తాము ఓ మూల కూర్చొని పార్టీ చేసుకొని.. వెళ్లిపోతామని సురేశ్, అప్పులు తెలిపారు. దీంతో నలుగురిలో ఒకడైన పార్తీబన్ అనే వ్యక్తి కోపంతో వారిపై దాడికి దిగాడు. కత్తితో అతను సురేశ్ తలపై, చేతులపై దాడి చేశాడు. మిగితా ముగ్గురు కూడా వీరిద్దరిపై కర్రలతో దాడి చేసి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత అప్పు.. తన స్నేహితులు సురేశ్‌ను తీసుకొని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి వెళ్లడంతో అసలు నిజం బయటకు వచ్చింది.

మరోవైపు.. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. లాక్‌డౌన్ సమయంలో స్మశానంలో అసాంఘిక పనులు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. కొందరు స్మశానంలో పార్టీలు చేసుకోవడమే కాక.. తమ ఆయుధాలను కూడా దాస్తున్నారని సీనియర్ పోలీసు అధికారులు ఒకరు పేర్కొన్నారు. ఇటువంటి దుర్ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..