AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆసక్తికరంగా ‘వ్యూహం’ ట్రైలర్.. క్రిస్మస్ కానుకంగా ‘ఆహా’లో విడుదల కానున్న సస్పెన్స్ థ్రిల్లర్.

టొవినో థామస్‌, నిమిషా, అను సితార నటీనటులుగా తెరకెక్కిన ‘వ్యూహం’ చిత్రం కిస్మస్ కానుకగా ఈ నెల 25న ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది.

ఆసక్తికరంగా ‘వ్యూహం’ ట్రైలర్.. క్రిస్మస్ కానుకంగా ‘ఆహా’లో విడుదల కానున్న సస్పెన్స్ థ్రిల్లర్.
Narender Vaitla
|

Updated on: Dec 23, 2020 | 7:03 PM

Share

aha vyuham trailer out: లాక్‌డౌన్ సమయంలో థియేటర్లు మూతపడడంతో ఓటీటీలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. నిర్మాతలు కూడా నేరుగా ఓటీటీలో సినిమాలను విడుదల చేస్తుండడంతో ఓటీటీ మార్కెట్ పెరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో సస్పెన్స్ థ్రిల్లర్ ఓటీటీ వేదికగా విడుదల కానుంది. టొవినో థామస్‌, నిమిషా, అను సితార నటీనటులుగా తెరకెక్కిన ‘వ్యూహం’ చిత్రం కిస్మస్ కానుకగా ఈ నెల 25న ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ అద్యంతం సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఆకట్టుకుంటోంది. ‘ఒక క్రిమినల్‌ను కాపాడే మిషన్‌లో ఉన్న వాడితో’, ‘పోలీసులు ఇంటికి వచ్చి అడిగారు నువ్వు ఏం చేశావని’ లాంటి డైలాగ్‌లు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక ‘కోర్టులో నిజం మాత్రమే చెప్పాలి.. నేను అలా చెప్పలేను’ అన్న సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ ఏంటా నిజం.? అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే ‘వ్యూహా’న్ని చూడాల్సిందే.