Murder Of Lawyer-Couple : అడ్వకేట్ దంపతుల హత్య కేసు విచారణ.. సుందిళ్ల బ్యారేజీపై పోలీసులు ఫోకస్

Lawyer couple murdered : అడ్వకేట్ దంపతుల హత్య కేసు విచారణ సీన్‌.. సుందిళ్ల బ్యారేజీకి చేరింది. విచారణను వేగవంతం చేసిన పోలీసులు...నిందితులను కస్డడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Murder Of Lawyer-Couple : అడ్వకేట్ దంపతుల హత్య కేసు విచారణ.. సుందిళ్ల బ్యారేజీపై పోలీసులు ఫోకస్
vaman rao advocate
Follow us

|

Updated on: Feb 28, 2021 | 7:03 PM

Murder Of Lawyer-Couple :  అడ్వకేట్ దంపతుల హత్య కేసు విచారణ సీన్‌.. సుందిళ్ల బ్యారేజీకి చేరింది. విచారణను వేగవంతం చేసిన పోలీసులు…నిందితులను కస్డడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. హత్య తర్వాత ఆయుధాలను బ్యారేజ్‌లో పడేయడంతో వాటిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు.. జల్లెడపడుతున్నారు. అటు.. హ‌త్య కేసులో ఆడియో, వీడియో రికార్డులు కీలకంగా మారనున్నాయి.

హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. నిందితులుగా ఉన్న బిట్టు శ్రీనుతో పాటు మరొకరని పోలీసులు పార్వతీ బ్యారేజ్‌కు తీసుకెళ్లారు. న్యాయవాదుల హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఘటన తర్వాత ఆయుధాలను సుందిళ్ల బ్యారేజీలో పడేసినట్లు నిందితులు చెప్పడంతో.. విశాఖ నుంచి గజ ఈతగాళ్లను రప్పించారు పోలీసులు. మూడు బృందాలుగా వారిని విడగొట్టి.. ఆయుధాలను వెలికితీసే పనిలో పడ్డారు.

ఈ నెల 17న పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద రోడ్డుపై వామన్‌రావు దంపతులను దారుణంగా హత్య చేయడం తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసులో.. ప్రధాన నిందితులుగా భావిస్తున్న బిట్టు శ్రీనుతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేసిన పోలీసులు.. విచారణలో నిందితుల నుంచి మరిన్ని వివరాలను రాబట్టేయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. వామన్‌రావుకు చెందిన మరో ఆడియో .. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పై గట్టు వామన్‌ రావు మరో వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. శ్రీధర్ బాబు తనను అవమానపర్చాడని, నీతిలేని వ్యక్తి అని వేరే వ్యక్తితో వామన్ రావు చెప్పేమాటలు.. హల్‌చల్‌ చేస్తున్నాయి.

అటు.. ఈ కేసులో.. ఆడియో, వీడియో సాక్ష్యాలు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే హత్య జరిగే సమయంలో రికార్డు చేసిన వీడియోలను పరిగణలోకి తీసుకోవాలని, బస్సులో ఉన్న వారిని గుర్తించి సాక్షులుగా చేర్చాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. రేపు పోలీసులు కోర్టుకు స్టేటస్‌ రిపోర్టును సమర్పించనున్నారు. మరోవైపు బిట్టు శ్రీనును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. అతని నుంచి కీలక సమాచారాన్ని రాబడుతున్నట్టుగా తెలుస్తోంది.

Also Read:

దీప్తితో బ్రేకప్ అయ్యిందా..? షణ్ముఖ్‌ జశ్వంత్ సోషల్ మీడియా లైవ్‌లో క్లారిటీ ఇచ్చేశాడు

లైంగిక శక్తి పెరుగుతుందని, వీర్యపుష్టి కలుగుతుందని ప్రచారం.. ఏపీలో గాడిదలు కనుమరుగు