AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రేటర్ లో ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు.. నగరంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రోడ్‌షో

గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరెత్తిస్తున్నాయి.

గ్రేటర్ లో ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు.. నగరంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రోడ్‌షో
Balaraju Goud
|

Updated on: Nov 28, 2020 | 5:13 PM

Share

గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతాపార్టీ బల్దియా ఎన్నికలను సవాల్ గా స్వీకరించి ప్రచారంలో దూసుకుపోతుంది. అగ్రనేతలందరినీ భాగ్యనగరానికి రప్పిస్తోంది. ఈ ప్రచారంలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నగరంతో విస్తృతస్ధాయిలో పర్యటిస్తున్నారు. బీజేపీ కార్పొరేటర్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కూకట్‌పల్లి డివిజన్ నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. కూకట్‌పల్లి ఉషా ముళ్లపూడి కమాన్‌ నుంచి ఆల్విన్‌ ప్రధాన కూడలి వరకు ఈ రోడ్‌షో కొనసాగుతోంది. రోడ్‌షోలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తదితర నేతలు పాల్గొన్నారు. అంతకుముందు నగరానికి చేరుకున్న యోగి ఆదిత్యనాథ్‌కు బీజేపీ, జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అటు నుంచి నేరుగా ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.