AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

గుంటూరు జిల్లాలో ఘోర యాక్సిడెంట్ చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీ కొన్న ఘటనలో ఇద్దురు చనిపోగా.. ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Ram Naramaneni
|

Updated on: Sep 09, 2020 | 6:40 PM

Share

గుంటూరు జిల్లాలో ఘోర యాక్సిడెంట్ చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీ కొన్న ఘటనలో ఇద్దురు చనిపోగా.. ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గుంటూరులోని శావల్యాపురం మండలంలో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. కనమర్లపూడి వద్ద రెండు కార్లు ఒకదానికి ఒకటి బలంగా ఢీ కొట్టాయి. ఏలూరు నుంచి వినుకొండ వైపు వస్తున్న కారు నంద్యాల నుంచి విజయవాడ వెళ్తున్న మరో కారు, ఎదురేదురుగా వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో నంద్యాలకు చెందిన వెంకటసుబ్బయ్య, ఏలూరుకి చెందిన ఉదయ్  అనే వ్యక్తులు స్పాట్ లోనే మృతి చెందారు.‌ మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వినుకొండ గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు.

Also Read :

రాయలసీమ, దక్షిణ కోస్తాలకు భారీ వర్ష సూచన !

‘చిన్నారి పెళ్లికూతురు’ బామ్మకు బ్రెయిన్ స్ట్రోక్