జమ్ములో ఉగ్రవాదులకు బలైపోయిన నిజామాబాద్జిల్లా జవాను
జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లా మచిల్ సెక్టార్ లో ముష్కరులపై జరిపిన పోరాటంలో అసువులు బాసిన భారత జవాన్లు నలుగురిలో మన తెలంగాణ జవాను మహేశ్ ఉన్నారు. ఉగ్రమూకలపై తన పరాక్రమాన్ని ప్రదర్శించి వీరమరణం చెందిన ఆర్ మహేశ్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా కోమన్పల్లి.. ఏడాది క్రితమే మహేశ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 8 నెలల క్రితం సైన్యంలో జాయిన్ అయిన మహేశ్ ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. చిన్నతనం నుంచి […]
జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లా మచిల్ సెక్టార్ లో ముష్కరులపై జరిపిన పోరాటంలో అసువులు బాసిన భారత జవాన్లు నలుగురిలో మన తెలంగాణ జవాను మహేశ్ ఉన్నారు. ఉగ్రమూకలపై తన పరాక్రమాన్ని ప్రదర్శించి వీరమరణం చెందిన ఆర్ మహేశ్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా కోమన్పల్లి.. ఏడాది క్రితమే మహేశ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 8 నెలల క్రితం సైన్యంలో జాయిన్ అయిన మహేశ్ ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. చిన్నతనం నుంచి చురుకుగా ఉండే మహేశ్కు.. సైన్యం చేరాలన్నది లక్ష్యం. ఆ దిశగానే కుటుంబసభ్యులను ఒప్పించి అందులో చేరాడు. మహేష్ మృతదేహాన్ని రేపు స్వస్థలానికి తీసుకువచ్చే అవకాశం ఉంది.