AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా పరీక్షలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఫిర్యాదులు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం

తెలంగాణలో కరోనా పరీక్షల తీరుపై రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న కొవిడ్ పరీక్షల నిర్వహణ బాగులేదని పేర్కొంది.

కరోనా పరీక్షలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఫిర్యాదులు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం
Balaraju Goud
|

Updated on: Nov 26, 2020 | 4:21 PM

Share

తెలంగాణలో కరోనా పరీక్షలపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకు కోర్టు ధిక్కారణ నోటీసు జారీ చేసింది. రోజుకు 50 వేల కరోనా పరీక్షలు చేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. కరోనాకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై గురువారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. అంతేకాదు ప్రైవేట్‌ ఆస్పత్రులపై కూడా చర్యలు తీసుకోవడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే 50 వేల కరోనా పరీక్షలు అవసరం ఉన్నప్పుడు చేస్తామని శ్రీనివాసరావు నివేదికలో పేర్కొన్నారు. దీంతో కోర్టు ధిక్కారణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని శ్రీనివాసరావును హైకోర్టు ఆదేశించింది.

కరోనా పరీక్షలపై మరోసారి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించింది హైకోర్టు . జీహెచ్‌ఎంసీలో మాస్కులు, భౌతికదూరం నిబంధనలు సరిగా అమలు కావడంలేదని పేర్కొంది. జీవో 64 అమలు అధికారం పోలీసులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు కరోనా మరణాలపై ఆడిట్‌ కమిటీ ఏర్పాటును పరిశీలించాలని సూచించింది. కరోనాబాధితులకు ధైర్యమిచ్చేలా మానసికకేంద్రం ఏర్పాటుచేయాలి కోరింది. డిసెంబర్‌ 15లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చేనెల 17కు వాయిదా వేసింది హైకోర్టు.