AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీఎస్ ఎంసెట్ రాసే ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్..

తెలంగాణ ఎంసెట్ 2020ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి స్పష్టం చేశారు. జూలై 6,7,8 తేదీల్లో ఇంజనీరింగ్.. అలాగే జూలై 8,9 తేదీల్లో అగ్రికల్చర్ విభాగంలో పరీక్షలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్‌ రాసే ఏపీ విద్యార్ధులకు తమ పరీక్షా కేంద్రాలను మార్చుకునేందుకు వెసులుబాటును కల్పిస్తోంది తెలంగాణ ఉన్నత విద్యామండలి. ఇవాళ అర్ధరాత్రి లోపు eamcet.tsche.ac.inను సంప్రదించాలని సూచించింది. రోజుకు 50 వేల మంది స్టూడెంట్స్ కంప్యూటర్ బేస్డ్ […]

టీఎస్ ఎంసెట్ రాసే ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్..
Ravi Kiran
|

Updated on: Jun 23, 2020 | 11:23 AM

Share

తెలంగాణ ఎంసెట్ 2020ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి స్పష్టం చేశారు. జూలై 6,7,8 తేదీల్లో ఇంజనీరింగ్.. అలాగే జూలై 8,9 తేదీల్లో అగ్రికల్చర్ విభాగంలో పరీక్షలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్‌ రాసే ఏపీ విద్యార్ధులకు తమ పరీక్షా కేంద్రాలను మార్చుకునేందుకు వెసులుబాటును కల్పిస్తోంది తెలంగాణ ఉన్నత విద్యామండలి. ఇవాళ అర్ధరాత్రి లోపు eamcet.tsche.ac.inను సంప్రదించాలని సూచించింది. రోజుకు 50 వేల మంది స్టూడెంట్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తారని.. తెలంగాణలో 16, ఏపీలో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. రూ. 5 వేల ఫైన్‌తో ఈ నెల 25 వరకు, రూ. 10 వేల జరిమానాతో ఈ నెల 30 వరకు ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Also Read:

జగన్ సర్కార్ మరో సంచలనం.. వారి ఖాతాల్లోకి నేరుగా రూ. 15 వేలు..

వర్మా.. రెస్ట్ ఇన్ పీస్.. నీపై కేసులు వేయనుః అమృత

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆగష్టులో సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలకు ఏర్పాట్లు..!

సుశాంత్ సూసైడ్‌లో కొత్త ట్విస్ట్.. ఆ ఇద్దరి మధ్య ‘అఫైర్’..!

జగన్ సర్కార్ సంచలనం.. ఉద్దానం కిడ్నీ బాధితులకు శుభవార్త..