సుశాంత్ సూసైడ్లో కొత్త ట్విస్ట్.. ఆ ఇద్దరి మధ్య ‘అఫైర్’..!
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై అనుమానాల నీడ కొనసాగుతోంది. తాజాగా హీరోయిన్ రియా చక్రవర్తి చెప్పే పొంతలేని వ్యాఖ్యలు కూడా అనుమానాలకు తావిస్తున్నాయి.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై అనుమానాల నీడ కొనసాగుతోంది. తమ అభిమాన హీరో ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తను ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఏఐఈఈఈ టాపర్.. అంతేకాక ప్రొఫెషనల్, ఫైనాన్సియల్గా ఎలాంటి ఇబ్బందులు లేనివాడు ఎలా సూసైడ్ చేసుకుంటాడని.? అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అభిమానులు అంటున్నారు. మరోవైపు ఇప్పటికీ సోషల్ మీడియాలో సుశాంత్ మరణంపై చర్చోపచర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఆత్మహత్య కాదని.. హత్యేనని.. పక్కా ప్లాన్తో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని కొంతమంది నెటిజన్లు వాదిస్తున్నారు. ఇక ఈ తతంగాన్ని బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మహేష్ భట్ నడిపించాడన్న వాదనలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. అంతేకాక తాజాగా హీరోయిన్ రియా చక్రవర్తి చెప్పే పొంతలేని వ్యాఖ్యలు కూడా అనుమానాలకు తావిస్తున్నాయి.
ఇటీవల ముంబై పోలీసులు రియా చక్రవర్తిని విచారించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె సుశాంత్ ఇంట్లో దయ్యాలు ఉన్నాయంటూ కేసును తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేసింది. ‘సుశాంత్ ఇంట్లో దయ్యం ఉందని.. అతడితో కలిసి ఉన్నప్పుడు యేవో శక్తులు ఉన్నట్లుగా అనిపించిందని తెలిపింది. అంతేకాకుండా సుశాంత్ యశ్రాజ్ ఫిల్మ్స్తో కాంట్రాక్టులు రద్దు చేసుకున్నాడని.. ఆ బ్యానర్లో తనకు కూడా సినిమాలు చేయవద్దని చెప్పినట్లుగా రియా వివరించింది.
అటు సుశాంత్కు కొన్నేళ్లుగా చికిత్స అందించిన మానసిక వైద్యుడు కేసరి చావ్డాని పోలీసులు విచారించినప్పుడు.. సుశాంత్ గత కొద్దిరోజులుగా రాత్రులు నిద్ర లేకుండా గడిపాడని.. ప్రియురాలు రియా చక్రవర్తి ప్రవర్తన కూడా సుశాంత్ను ఇబ్బంది పెట్టినట్లుగా పోలీస్ విచారణలో డాక్టర్ పేర్కొన్నాడట. దీనితో మహేష్ భట్, రియా చక్రవర్తిల మధ్య ఎఫైర్ కారణంగానే.. వాళ్లు తీవ్ర వేధింపులు భరించలేకే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.