జగన్ సర్కార్ సంచలనం.. ఉద్దానం కిడ్నీ బాధితులకు శుభవార్త..
రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలన సాగిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్ అందించారు.
రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలన సాగిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్ అందించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని 38 మండలాల్లో ఉన్న 2856 మంది కిడ్నీ పేషెంట్లు ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించనున్నారు. డయాలసిస్ చేయించుకునేందుకు తరచుగా వెళ్లే కిడ్నీ బాధితులకు ప్రయాణ ఛార్జీలు అధిక భారంగా మారుతున్నాయి. దీనితో వారిని ఆదుకునేందుకు జగన్ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కాగా, ఏపీ ప్రభుత్వం డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు నెలకు రూ. 10,000 పెన్షన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అటు సీరం క్రియేటినైన్ 5కు మించి ఉన్న రోగులకు కూడా నెలకు రూ. 5000 పెన్షన్ ఇస్తోంది. ఇప్పటివరకు బాధితులు డయాలసిస్ కేంద్రాలకు వెళ్లేందుకు ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పిస్తుండటం వారందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు.