Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

127 ఏళ్ల చరిత్రకు ముగింపు.. రెండుగా విడిపోయిన గోద్రేజ్ కంపెనీ

127 ఏళ్ల చరిత్రకు ముగింపు.. రెండుగా విడిపోయిన గోద్రేజ్ కంపెనీ

Phani CH

|

Updated on: May 03, 2024 | 7:35 PM

దేశంలోని ప్రముఖ కంపెనీలలో ఒకటిగా, 127 ఏళ్ల చరిత్ర కలిగిన గోద్రేజ్ కంపెనీ విడిపోయింది. గోద్రేజ్ కుటుంబ వారసులు గ్రూప్ ను రెండుగా విభజించారు. ఈమేరకు వారసుల మధ్య ఒప్పందం కుదిరిందని, వాటాల పంపకం కూడా పూర్తయిందని సమాచారం. ఈ ఒప్పందం ప్రకారం.. ఆది గోద్రేజ్, నదిర్ ల వాటా కింద 5 లిస్టెడ్‌ కంపెనీలు కలిగిన గోద్రేజ్ ఇండస్ట్రీస్‌ను దక్కించుకోగా, జెంషెడ్ గోద్రేజ్, స్మితా గోద్రేజ్ కృష్ణలకు అన్ లిస్టెడ్ గ్రూప్ గోద్రేజ్ అండ్ బోయ్స్, దాని అనుబంధ సంస్థలు దక్కాయి.

దేశంలోని ప్రముఖ కంపెనీలలో ఒకటిగా, 127 ఏళ్ల చరిత్ర కలిగిన గోద్రేజ్ కంపెనీ విడిపోయింది. గోద్రేజ్ కుటుంబ వారసులు గ్రూప్ ను రెండుగా విభజించారు. ఈమేరకు వారసుల మధ్య ఒప్పందం కుదిరిందని, వాటాల పంపకం కూడా పూర్తయిందని సమాచారం. ఈ ఒప్పందం ప్రకారం.. ఆది గోద్రేజ్, నదిర్ ల వాటా కింద 5 లిస్టెడ్‌ కంపెనీలు కలిగిన గోద్రేజ్ ఇండస్ట్రీస్‌ను దక్కించుకోగా, జెంషెడ్ గోద్రేజ్, స్మితా గోద్రేజ్ కృష్ణలకు అన్ లిస్టెడ్ గ్రూప్ గోద్రేజ్ అండ్ బోయ్స్, దాని అనుబంధ సంస్థలు దక్కాయి. వీటితో పాటు వారికి ముంబైలోని 3,400 ఎకరాల భూమి కూడా చెందనుంది. గోద్రెజ్ బ్రాండ్‌ను రెండు గ్రూపులు ఉపయోగించుకునేలా వారిమధ్య అంగీకారం కుదిరింది. గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌లో ఆది గోద్రేజ్ కుమార్తె పిరోజ్ షా గోద్రెజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తారు. 2026 ఆగస్టులో బాధ్యతలు స్వీకరించనున్నారు. గోద్రెజ్ & బోయ్స్ గ్రూప్‌ నకు సీఎండీగా జంషెడ్ గోద్రెజ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ న్యారికా హోల్కర్ నేతృత్వం వహిస్తారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విడాకులు తీసుకున్న కూతురికి మేళ‌తాళాల‌తో స్వాగ‌తం

డైమండ్‌ రింగ్‌ కావాలా ?? అయితే ఓటు వేయండి !!

షారూఖ్ చేసిన చిన్న మిస్టేక్‌తో.. 2 కోట్ల లాస్ !!

‘గుడ్డిగా నమ్ముతున్నాడు..’ స్టార్ హీరో తండ్రి ఆవేదన

Chiranjeevi: వావ్! చిరు 22 ఏళ్ల కిందటి వీడియో.. ఇప్పుడు వైరల్