మిడతల దండును సమర్థవంతంగా అడ్డుకుందాం..! – సీఎం కేసీఆర్

రాజస్థాన్, మహారాష్ట్ర మీదుగా తెలంగాణ వైపు దూసుకువస్తున్న పాకిస్తాన్ మిడతలదండుపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మిడతల దండు రాష్ట్రానికి వస్తే చేపట్టాల్సిన చర్యలపై సీఎం అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి అధికారులు, శాస్ర్తవేత్తలు, నిపుణులు హాజరయ్యారు. మిడతల దండు తెలంగాణ రాష్ట్రంలోకి దూసుకురాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సిఎస్ సోమేశ్ […]

మిడతల దండును సమర్థవంతంగా అడ్డుకుందాం..! - సీఎం కేసీఆర్
Follow us

|

Updated on: May 28, 2020 | 6:54 PM

రాజస్థాన్, మహారాష్ట్ర మీదుగా తెలంగాణ వైపు దూసుకువస్తున్న పాకిస్తాన్ మిడతలదండుపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మిడతల దండు రాష్ట్రానికి వస్తే చేపట్టాల్సిన చర్యలపై సీఎం అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి అధికారులు, శాస్ర్తవేత్తలు, నిపుణులు హాజరయ్యారు. మిడతల దండు తెలంగాణ రాష్ట్రంలోకి దూసుకురాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు బి.జనార్థన్ రెడ్డి, ఎస్.నర్సింగ్ రావు, జయేశ్ రంజన్, పిసిసిఎఫ్ శోభ, ప్రకృతి విపత్తు శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఫైర్ డిజి సంజయ్ కుమార్ జైన్, వ్యవసాయ యూనివర్సిటీ విసి ప్రవీణ్ రావు, సిఐపిఎం ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ ఆర్. సునిత, వ్యవసాయ యూనివర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్. జె. రహమాన్ తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్ర సరిహద్దులో గల జిల్లాల కలెక్టర్లను, పోలీసు అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. మిడతల దాడిని అడ్డుకునేందుకు ఫైర్ ఇంజన్లను, జెట్టింగ్ మిషన్లను, పెస్టిసైడ్లను సిద్ధంగా పెట్టినట్లు చెప్పారు. మిడతల దండు కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని నియమించినట్లు చెప్పారు. దేశంలో మిడతల దండు ప్రవేశం, ప్రయాణం, ప్రభావం తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాబోయే రోజుల్లో అవి ఎటువైపు వెళ్లే అవకాశం ఉందనే విషయాన్ని ఆరా తీశారు. రాజస్తాన్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించిన మిడతల దండు ప్రస్తుతం మహారాష్ట్రలోని భండార, గోండియా మీదుగా మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ వైపు వెళ్తున్నట్లు సమాచారం ఉందని అధికారులు చెప్పారు. అక్కడి నుంచి ఉత్తర భారతదేశంవైపు ప్రయాణించి పంజాబ్ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గాలివాటం ప్రకారం ప్రయాణించే అలవాటున్న మిడతల దండు, ఒకవేల గాలి దక్షిణం వైపు మళ్లితే చత్తీస్ గఢ్ మీదుగా తెలంగాణ వైపు వచ్చే అవకాశాలు లేకపోలేదని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు నిపుణులు. మిడతల దండు తెలంగాణ వైపు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉండాలని.. సరిహద్దుల్లోనే వాటిని పెద్ద ఎత్తున పురుగుల మందు పిచికారి చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.