నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ దూరం..ఎందుకంటే?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీలో జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేక ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ అధ్యక్షతన జరగబోతున్న తొలి నీతి ఆయోగ్ సమావేశం కావడంతో… ఈ భేటీకి కేసీఆర్ హాజరవుతారని అంతా భావించారు. అయితే త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో…పలువురు ప్రముఖులను ఆహ్వనించాల్సి […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీలో జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేక ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ అధ్యక్షతన జరగబోతున్న తొలి నీతి ఆయోగ్ సమావేశం కావడంతో… ఈ భేటీకి కేసీఆర్ హాజరవుతారని అంతా భావించారు. అయితే త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో…పలువురు ప్రముఖులను ఆహ్వనించాల్సి ఉండటం, రాష్ట్రంలోని పలు శాఖలపై కీలకమైన సమీక్షలు నిర్వహించాల్సి ఉన్నందునే కేసీఆర్ నీతి ఆయోగ్ కార్యక్రమానికి వెళ్లడం లేదని సమాచారం.