AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ తహశీల్దార్ నాగరాజు కేసులో ముగిసిన కస్టడీ

రాష్ట్రంలో సంచ‌ల‌నం కలిగించిన కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు అవినీతి కేసులో మూడోరోజు ఏసీబీ విచారణ కొనసాగుతోంది. కస్టడీ ఇవాళ్టితో ముగుస్తుండడంతో దర్యాప్తు వేగవంతం చేసి వివరాలు రాబట్టినట్లు సమాచారం.

మాజీ తహశీల్దార్ నాగరాజు కేసులో ముగిసిన కస్టడీ
Balaraju Goud
|

Updated on: Aug 27, 2020 | 6:43 PM

Share

రాష్ట్రంలో సంచ‌ల‌నం కలిగించిన కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు అవినీతి కేసులో మూడోరోజు ఏసీబీ విచారణ కొనసాగుతోంది. కస్టడీ ఇవాళ్టితో ముగుస్తుండడంతో దర్యాప్తు వేగవంతం చేసి వివరాలు రాబట్టినట్లు సమాచారం. రూ.కోటి.10 లక్షల పై రియల్టర్‌ శ్రీనాథ్‌ వివరణ ఇచ్చారు. నాగరాజుకు శ్రీనాథ్‌ సహకరించాడన్న నేపథ్యంలో ‌శ్రీనాథ్‌ను అధికారులు విచారించారు. కాగా, రియల్‌ ఎస్టేట్‌కు చెందిన సత్య డెవలపర్స్‌ కోసం డబ్బులు తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చాడు. నాగరాజు సహచరుడు అంజిరెడ్డి వద్ద దొరికిన ప్రజాప్రతినిధి డాక్యుమెంట్లపై ఏసీబీ వివరాలు సేకరించింది. గుండ్ల పోచంపల్లిలో ఆక్రమణలకు గురైన భూముల వివరాలను ఆర్‌టీఐ ద్వారా సేకరించిన డాక్యుమెంట్లని అంజిరెడ్డి ఏసీబీకి వెల్లడించాడు. కీసర మండలం రాంపల్లి దయారా గ్రామానికి సంబంధించిన రూ.54 లక్షల ఎంపీ నిధుల మంజూరు లెటర్‌హెడ్‌పై ఏసీబీ అధికారులకు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం.

కాగా, తహశీల్దార్‌ నాగరాజు ఏసీబీ అధికారులకు సహకరించడం లేదని, బ్యాంక్‌ లాకర్లపై నోరు మెదపడం లేదని అధికారులు తెలిపారు. బినామీ ఆస్తులపై, తాను చేసిన అక్రమాలపై ఏసీబీకి పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం. అయితే, ఇదే కేసులో కీసర రెవెన్యూ శాఖ సిబ్బందిని ఏసీబీ ప్రశ్నించింది. నేటితో నలుగురు నిందితుల కస్టడీ ముగియనుంది. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ఎదుట ఏసీబీ హాజరుపర్చనున్నారు ఏసీబీ అధికారులు.