ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వీరే టాప్..

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్ల జాబితాలో పేసర్‌ బుమ్రా రెండో ర్యాంకులో నిలిచాడు.

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వీరే టాప్..
Follow us

|

Updated on: Nov 05, 2020 | 9:11 AM

ICC ODI Rankings : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్ల జాబితాలో పేసర్‌ బుమ్రా రెండో ర్యాంకులో నిలిచాడు.

కరోనా వైరస్ కారణంగా కోహ్లీ, రోహిత్‌ కనీసం ఒక్క వన్డే మ్యాచ్‌ కూడా ఆడలేదు. అయినప్పటికీ బ్యాట్స్‌మెన్‌ జాబితాలో కోహ్లీ 871 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, రోహిత్‌ 855 పాయింట్లతో రెండో స్థానంలో ఉంటూ తమ ఆధిపత్యాన్ని నిలుపుకున్నారు.

పాకిస్తాన్‌, జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ అనంతరం ఐసీసీ ర్యాంకింగ్స్‌ ప్రకటించింది. జింబాబ్వేతో సిరీస్‌లో 221 పరుగులు సాధించిన పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌.. వీరిద్దరి ర్యాంకులపై కన్నేశాడు.  837 పాయింట్లను సాధించి.. రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాడు. రోహిత్ శర్మ కంటే బాబర్‌కు 18 పాయిట్లు తక్కువగా ఉన్నాయి.

సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన బాబర్‌ ఎనిమిది పాయింట్లు సాధించి మన ఆటగాళ్ల తర్వాత స్థానంలోకి వచ్చి చేరాడు. టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ నాలుగో స్థానంలో ఉండగా.. విరాట్‌ తొమ్మిదిలో కొనసాగుతున్నాడు.