ఏసీ కంటైనర్, 2800 కి.మీ. విమాన ప్రయాణం..మంచు పర్వతాల అద్భుత ఫలం యూఏఈకి చేరుకుంది!
హిమాలయాల మంచు కొండల నడుమ పండే లదాఖ్ ప్రత్యేక ఫలాల రుచి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది. లదాఖ్ ఉద్యానవన రంగాన్ని ప్రపంచ వేదికపై నిలిపేలా ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ఆ ప్రాంతానికి చెందిన 5 మెట్రిక్ టన్నుల ప్రీమియం క్వాలిటీ ఆప్రికాట్స్ మొదటి భారీ ఎగుమతి కంటైనర్ను యూఏఈ కి జెండా ఊపి ప్రారంభించారు.

లదాఖ్ కఠినమైన చల్లని వాతావరణం, పరిశుభ్రమైన గాలిలో ఎటువంటి రసాయనాలు లేకుండా పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పండే ఆప్రికాట్ (ఖుబానీ) పండు ఇప్పుడు అరబ్ దేశాలలో తన తీపిని పంచడానికి సిద్ధమైంది. లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా బుధవారం నాడు ఢిల్లీలోని లదాఖ్ భవన్ నుండి దుబాయ్ కి 5 మెట్రిక్ టన్నుల తాజా ఆప్రికాట్స్ మొదటి విడతను జెండా ఊపి ప్రారంభించారు. ఈ చారిత్రాత్మక చర్యను ప్రకటిస్తూ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో ఇలా రాశారు.
భారీ ఎగుమతి లక్ష్యం:
లదాఖ్ ప్రభుత్వం ప్రసిద్ధ గ్లోబల్ రిటైల్ సంస్థ లులు గ్రూప్, అపెడా లతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా ఈ సీజన్లో ఏకంగా 1,000 మెట్రిక్ టన్నుల (10 లక్షల కిలోలు) ఆప్రికాట్స్ను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత రెండేళ్లలో కేవలం 1,500 కిలోలు మాత్రమే ఎగుమతి కాగా, ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోవడం లదాఖ్ రైతులకు ఒక చారిత్రాత్మక మైలురాయి. ఈ పండ్లను సురక్షితంగా రవాణా చేయడానికి ఏసీ ట్రక్కులు, రిఫ్రిజరేటెడ్ కంటైనర్లను ఉపయోగిస్తున్నారు.
ఆప్రికాట్స్ (ఖుబానీ) వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు:
గుండెకు రక్షణ: ఆప్రికాట్స్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
पिछले कुछ समय से @APEDADOC के प्रयासों से देशभर के किसानों को उनकी उपज का बेहतर मूल्य और वैश्विक बाजार तक नई पहुंच मिल रही है। लद्दाख से UAE के लिए 5 मीट्रिक टन ऑर्गेनिक खुबानी की पहली खेप का निर्यात इसका एक और सशक्त उदाहरण है।
यह पहल भारतीय ऑर्गेनिक उत्पादों को अंतरराष्ट्रीय… pic.twitter.com/cVC5neLYXQ
— Piyush Goyal (@PiyushGoyal) July 16, 2026
ఎముకలకు బలం: ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచి, వాటిని బలంగా మారుస్తాయి. కీళ్లనొప్పులు (ఆర్థరైటిస్) ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
మెరిసే చర్మం: ఆప్రికాట్స్లో ఉండే విటమిన్ సి, ఇతర పోషకాలు చర్మాన్ని కాంతివంతంగా, మచ్చలు లేకుండా ఉంచడానికి తోడ్పడతాయి.
అతిగా తింటే వచ్చే దుష్ప్రభావాలు:
జీర్ణ సమస్యలు: ఆప్రికాట్స్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి, వీటిని పరిమితికి మించి తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా విరేచనాలు వంటి జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
రక్తంలో చక్కెర పెరగడం: ఎండు ఖుబానీలలో సహజ చక్కెరలు సాంద్రత రూపంలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, మధుమేహం ఉన్నవారు వీటిని అతిగా తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి.
అలెర్జీలు: కొంతమందిలో ఈ పండు తినడం వల్ల చర్మంపై దద్దుర్లు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అలెర్జీ లక్షణాలు కనిపించవచ్చు.
లదాఖ్ ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల వల్ల అక్కడ పండే రక్తసే కర్పో, హల్మాన్ రకం ఆప్రికాట్స్కు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. ఇవి రుచికరమైనవే కాకుండా పరిమిత మోతాదులో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.




